Bihar Mystery well Boiling water
Bihar Mystery well Boiling water : బీహార్లో ఓ వింత చోటుచేసుకుంది. 20 ఏళ్లుగా ఎండిపోయిన బావిలోంచి నీరు పెల్లుబికి పొంగుతోంది. ఇదో పెద్ద వింతా..? అనుకోవచ్చు. కానీ ఆ నీరు వేడిగా సలసలా కాగిపోతోంది. పొగలు కక్కుతు పొంగుతోంది. దీంతో ఈ వింత చూడటానికి జనాలు తండోపతండాలుగా వచ్చి చూస్తున్నారు. భాగల్ పూర్ లోని ఓ బావిలోంచి నీరు కుతకుత ఉడుకుతున్నట్లుగా ఉంటంతో ఆ ప్రాంతం చుట్టు పక్కల నుంచి జనాలు భారీగా తరలి వచ్చి చూస్తున్నారు.
లోని భాగల్పూర్ జిల్లాలోని గోరాబీప్ పరిధిలోని హర్చండీలోని బదరీ బహరియాలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. బదరీ బహరియా మెట్ల బావి చర్చనీయాంశంగా మారింది. ఈ బావి గత 20 ఏళ్లుగా పూర్తిగా ఎండిపోయివుంది. 70 ఏళ్ల క్రితం ఓ వ్యవసాయ పొంలంలో నిర్మించిన ఈ బావి 20 ఏ్ళలుగా పూర్తిగా ఎండిపోయింది. కానీ ఈ బావిలోంచి వేడి నీరు పొంగుతుండటంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఈ నీరు చూడటానికి కుత కుత ఉడుకుతున్నట్లుగా కనిపిస్తోంది. కానీ పట్టుకుని చూస్తే మాత్రం చల్లగానే ఉంటం విశేషంగా మారింది.
ఈ గ్రామానికి చెందిన ఓ యువకుడు మెట్ల ద్వారా బావిలోనికి వెళ్లి చూశాడు. నీరు బావికి ఒక స్థాయికి వచ్చి ఆగిపోయింది. ఈ విషయాన్ని ఆ యువకుడు ఊర్లో అందరికి చెప్పగా ఈ వింత ఆ నోటా ఈ నోటా ఆ చుట్టుపక్కల అంతా తెలిసింది. దీంతో జనాలు తరలి వచ్చి ఆ వింతను చూస్తున్నారు. దాదాపు 80 అడుగుల లోతు ఉండే ఈ బావిలో పొంగిన నీరు 25 అడుగుల పైకి పొంగి అక్కడే ఆగిపోయింది.
ఈ విషయం తెలిసిన అదే గ్రామానికి చెందిన ఓ ప్రొఫెసర్ ఈ నీటిని డీటీఎస్ పరీక్షలకు పంపారు. ఈ నీరు తాగటానికి పనికిరాదని తేల్చి చెప్పారు. వేడి నీరు పొంగుతోందని తెలిసిన కొంతమంది కుర్రాళ్లు ఈ బావి వద్దకు స్నానాలు చేయటానికి ఉత్సాహంగా వస్తున్నారు. ఇంతకంటే మరో విచిత్రం ఏమిటంటే ఈ నీటితో స్నానం చేశానని తనకు అంతకు ముందున్న చర్మ రోగాలన్నీ తగ్గిపోయాయని తెలిపింది సునైనాదేవి అనే ఓ మహిళ. దీంతో ఆమె చెప్పేది నిజమో కాదో తెలియదు గానీ ఆ మాటల్ని నమ్మిన చాలామంది ఈ బావిలోని నీటితో స్నానం చేస్తున్నారు.