Home » Photo-gallery » Rahul Bharat Jodo Yatra In Kamareddy District
Bharath Jodo Yatra: తెలంగాణలో నేటితో లాస్ట్.. కామారెడ్డి జిల్లాలో రాహుల్ భారత్ జోడో యాత్ర.. ఫొటో గ్యాలరీ
Bharath Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో నేటితో ముగియనుంది. కామారెడ్డి జిల్లాలో యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్ర సాయంత్రం సమయంలో మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. సోమవారం ఉదయం బిచ్కుంద మండలం పత్లా పూర్ వద్ద ప్రారంభమైన యాత్ర సాయంత్రం 4 గంటలకు మేనూరు గ్రామం వద్దకు చేరుకుంటుంది. అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో రాహుల్ పాల్గొని మాట్లాడతారు. అనంతరం మహారాష్ట్రలోకి యాత్ర ప్రవేశించనుంది. రాష్ట్రంలో జరిగే భారత్ జోడో యాత్ర చివరి సభకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చేలా పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు.