మరోసారి తెరపైకి శ్రీబాగ్ ఒప్పందం : ఏపీ రాజధానిపై వివాదం
ఏపీ రాజధాని విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో మరోసారి శ్రీబాగ్ ఒప్పందం తెరమీదికి వచ్చింది. మద్రాసు రాష్ట్రంలో తాము వివక్షకు గురవుతున్నామని, తెలుగు ప్రాంతాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని అప్పట్లో ఉద్యమం ప్రారంభమైంది.

ఏపీ రాజధాని విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో మరోసారి శ్రీబాగ్ ఒప్పందం తెరమీదికి వచ్చింది. మద్రాసు రాష్ట్రంలో తాము వివక్షకు గురవుతున్నామని, తెలుగు ప్రాంతాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని అప్పట్లో ఉద్యమం ప్రారంభమైంది.
ఏపీ రాజధాని విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో మరోసారి శ్రీబాగ్ ఒప్పందం తెరమీదికి వచ్చింది. మద్రాసు రాష్ట్రంలో తాము వివక్షకు గురవుతున్నామని, తెలుగు ప్రాంతాల ప్రజలకు మద్రాసు రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని అప్పట్లో ఉద్యమం ప్రారంభమైంది. ఈ క్రమంలో కోస్తాంధ్ర రాయలసీమ నాయకుల మధ్య ఏర్పడిన అపోహలను, విభేదాలను తొలగించడానికి ఓ ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్నే శ్రీబాగ్ ఒడంబడిక అని అంటారు.. 1937లో నవంబర్ 16న ఈ ఒప్పందం జరిగింది.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు హైదరాబాద్ రాజధానిగా ఉండిపోయింది. దీంతో ఏపీకి కొత్త రాజధాని ఏర్పాటు తప్పలేదు. ఈ క్రమంలోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం మాజీ న్యాయమూర్తి జస్టిస్ శివరామకృష్ణ నేతృత్వంలో రాజధాని అధ్యయన కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ రాష్ట్రం మొత్తం తిరిగి రాజధాని ఏర్పాటుపై నివేదికను ఇచ్చింది. అయితే.. రాజధాని ఏర్పాటుపై తుది నిర్ణయం కేంద్రం ఏపీ ప్రభుత్వానికే అప్పగించింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం నివేదికను పక్కన పెట్టి.. గుంటూరు జిల్లాలోని అమరావతికి శంకుస్థాపన చేశారు.
అమరావతిని రాజధానిగా నిర్ణయించడంపై వైసీపీ భగ్గుమంది. అసలు నదీతీర ప్రాంతాల్లో రాజధాని ఏంటి? అంటూ ప్రశ్నించింది. దీనికితోడు కొండవీటి వాగు విషయం తెరమీదికి వచ్చింది. కృష్ణాకు వరదలు వచ్చే అవకాశం ఉందని కూడా పేర్కొంది. అయినా కూడా బాబు తన మాటే నెగ్గించుకున్నారు. అయితే తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ పరంపరలోనే ఇప్పుడు కొత్తగా శ్రీబాగ్ ఒప్పందం తెరమీదికి వచ్చింది.
ఇక శ్రీబాగ్ ఒడంబడికలోని ముఖ్యాంశాలను ఓసారి పరిశీలిస్తే.. సీమ, కోస్తా రెండు ప్రాంతాల మధ్య సాంఘిక, సాంస్కృతిక సమానత్వం కోసం విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఆంధ్ర విశ్వవిద్యాలయం కింద అనంతపురంలో ఒక కేంద్రం ఏర్పాటు చేయాలి. సాగునీటిపారుదల అభివృద్ధి విషయంలో వెనకబడ్డ రాయలసీమ.. కోస్తాతో సమానమయ్యే వరకు సాగునీటి సరఫరా విషయంలో రాయలసీమ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి.
ఇక శాసనసభ స్థానాలను చూస్తే.. జనాభా ప్రాతిపదికన కాక, విస్తీర్ణం ఆధారంగా నిర్ణయించాలి. రాజధాని రాయలసీమలో ఉంటే హైకోర్టు ఆంధ్రాలో.. హైకోర్టు రాయలసీమలో ఉంటే రాజధాని ఆంధ్రాలో ఉండాలి. శ్రీబాగ్ ఒడంబడిక మేరకే కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 1956 నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రాలో విలీనం చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ రాజధాని అయింది. అనంతరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడంతో నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధానిగా చంద్రబాబు ప్రభుత్వం గుంటూరు జిల్లాలోని అమరావతిని ఎంపిక చేసింది. దీంతో రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాలనే డిమాండ్ ముందుకు వచ్చింది. ఇప్పుడు తాజాగా సీమ వాసులు శ్రీబాగ్ ఒప్పందాన్ని తెరమీదికి తెచ్చారు.