Team India vice captain
టీమ్ఇండియా అతి త్వరలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటన దాదాపు నెల రోజుల పాటు సాగనుంది. ఈ పర్యటనలో భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచులు ఆడనుంది. డిసెంబర్ 10న భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్తో టీమ్ఇండియా పర్యటన ఆరంభం కానుంది. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు ఏం చేస్తున్నారు అన్న దానిపై అభిమానుల దృష్టి నెలకొంది.
ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడుతోంది. వన్డే ప్రపంచకప్ 2023లో ఆడిన చాలా మంది సీనియర్ ఆటగాళ్లు విశ్రాంతి తీసుకోవడంతో యువ ఆటగాళ్లను ఆసీస్తో టీ20 సిరీస్కు ఎంపిక చేశారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా, షమీ, రవీంద్ర జడేజా వంటి కీలక ఆటగాళ్లు ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. సఫారీ పర్యటనలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కేవలం టెస్టు మ్యాచులు మాత్రమే ఆడనున్నారు.
15 నెలల తరువాత..
సఫారీ పర్యటనలో వన్డేలకు ఎంపిక కానీ రవీంద్ర జడేజా టీ20, టెస్టులకు ప్రకటించిన జట్లలో చోటు దక్కించుకున్నాడు. అంతేకాదు టీ20ల్లో అతడికి వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. వాస్తవానికి జడేజా 15 నెలల తరువాత టీ20 మ్యాచ్ ఆడనున్నాడు. 2022లో జరిగిన ఆసియా కప్ లో ఆడిన తరువాత గాయపడడంతో టీ20 ప్రపంచకప్కు దూరం అయ్యాడు. మళ్లీ ఇన్నాళ్లకు టీ20 మ్యాచులు ఆడుతున్నాడు.
కాగా.. ప్రస్తుతం రవీంద్ర జడేజా పారిస్ పర్యటనలో ఉన్నాడు. తనకు దొరికిన విరామాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో జడేజా పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలు వైరల్గా మారాయి. పారిస్ పర్యటనను ముగించుకుని స్వదేశానికి రాగానే దక్షిణాఫ్రికాకు వెళ్లే జట్టుతో జడేజా కలవనున్నాడు.
Bizarre No Ball : విచిత్రమైన నో బాల్.. మ్యాచ్ ఫిక్సింగ్ చేశావా ఏంటి..? ఇలా ఎప్పుడు చూడలేదే..?