టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మే నెలలో టెస్ట్ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చారు. ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఆ ఇద్దరు ఇంగ్లాండ్లో పర్యటించాల్సి ఉండగా, ఆ ఫార్మాట్కు గుడ్ బై చెప్పడంతో క్రికెట్ అభిమానులు షాక్ అయ్యారు.
అంతకుముందు టీమిండియా పొట్టి ఫార్మాట్లో 2024 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఆ ఇద్దరు క్రికెటర్లు అంతర్జాతీయ టీ20 మ్యాచులకు కూడా గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. వారిద్దరు ఇప్పుడు వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు.
అక్టోబర్-నవంబర్లో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. విరాట్, రోహిత్ని మనం మళ్లీ అక్టోబర్లోనే మైదానంలో చూస్తాం. అనంతరం ఒక నెల విరామం తర్వాత నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6 వరకు దక్షిణాఫ్రికాతో వన్డేల్లోనూ ఆడతారు.
ఈ సిరీస్ తర్వాత విరాట్, రోహిత్ ఇద్దరికీ మరో నెల విశ్రాంతి ఉంటుంది. వచ్చే ఏడాది జనవరిలో న్యూజిలాండ్తో భారత్ వన్డే సిరీస్ ఆడనుంది. బీసీసీఐ శనివారం (జూన్ 14న) సిరీస్ షెడ్యూల్ను ప్రకటించింది. 2026లో విరాట్, రోహిత్ని అభిమానులు మైదానంలో తొలిసారి జనవరి 11న చూస్తారు.
షెడ్యూల్ ఇదే..
వచ్చే ఏడాదికి సంబంధించి వారి మొదటి మ్యాచ్ ఆ రోజున జరగనుంది. ఈ మ్యాచ్ వడోదరలోని బీసీఏ స్టేడియంలో జరుగుతుంది. ఈ సిరీస్లో రెండో వన్డే జనవరి 14న రాజ్కోట్లో జరుగుతుంది. ఇండోర్ జనవరి 18న మూడో వన్డేకు ఆతిథ్యం ఇస్తుంది. మూడు వన్డేలు భారత కాలమానం ప్రకారం ఆయా రోజుల్లో మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతాయి. 3 వన్డేల తర్వాత ఇరు జట్లు 5 టీ20ల్లో తలపడతాయి. వైజాగ్లో జనవరి 28న వైజాగ్లో మ్యాచు జరగనుంది. కానీ, ఇది టీ20 మ్యాచ్ కాబట్టి వారిద్దరు ఇందులో ఆడరు.
Also Read: బుద్ధి మార్చుకోని ఆసీస్.. ఓటమి భయంతో చెత్త మాటలు.. గట్టి గుణపాఠం చెప్పి సఫారీ జట్టు..
రోహిత్ వన్డేల్లో భారత్కు సారథ్యం వహిస్తుండగా, సూర్యకుమార్ యాదవ్ భారత టీ20 కెప్టెన్గా ఉన్నాడు. టెస్టులకు శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఉన్నాడు. న్యూజిలాండ్ సిరీస్ తర్వాత, విరాట్, రోహిత్ IPL 2026లో ఆడతారు. 2027 వన్డే ప్రపంచ కప్కు సిద్ధం కావడానికి 2026లో భారత్ మరిన్ని వన్డేలు ఆడే అవకాశం ఉంది.
విరాట్, రోహిత్ ఇద్దరూ వన్డే ప్రపంచ కప్ ఆడటం దాదాపుగా ఖాయం. భారత్ చివరిసారి 2011లో తర్వాత భారత్ను తమ తొలి వన్డే ప్రపంచ కప్ టైటిల్కు నడిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో రోహిత్-ఇండియా ఓడిపోయింది.