MS Dhoni : ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై బిగ్ అప్‌డేట్.. సీఎస్కేకు వీడ్కోలు ఎప్పుడంటే?

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్ పై ఓ వార్త చక్కర్లు కొడుతుంది.

MS Dhoni IPL Retirement : టీమిండియా మాజీ కెప్టెన్, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్ పై ఓ వార్త చక్కర్లు కొడుతుంది. గత కొద్దిరోజులుగా ధోనీ ఐపీఎల్ కు ఎప్పుడు వీడ్కోలు చెప్పబోతున్నాడన్న విషయంపై చర్చ జరుగుతుంది. గత ఏడాది ఐపీఎల్ తరువాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ, ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024లోనూ ధోనీ ఆడాడు. ఎప్పటిలా సీఎస్కే కెప్టెన్ బాధ్యతలను చేపట్టలేదు. వికెట్ కీపర్ గా జట్టులో తన పాత్రను పోషించాడు. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో ధోనీ ఆడాడు. అయితే, సీఎస్కే జట్టు ప్లేఆఫ్స్ కు అర్హత సాధించలేక పోయింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ఓటమిపాలై ప్లే ఆఫ్స్ అవకాశాలను చేజార్చుకుంది. ఆ మ్యాచ్ తరువాత ధోనీ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తారని విస్తృత ప్రచారం జరిగింది.

Also Read : IPL 2024 : హైదరాబాద్‌కు కలిసొచ్చిన వర్షం.. క్వాలిఫయర్‌లో తలపడే జట్లు ఇవే.. పూర్తి షెడ్యూల్ ఇలా ..

ఆర్సీబీ జట్టుతో జరిగిన మ్యాచ్ తరువాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని మాజీ క్రికెటర్లు అంచనావేశారు. కానీ ధోనీ అలాంటి నిర్ణయం ఏమీ ప్రకటించలేదు. తాజాగా ధోనీ రిటైర్మెంట్ పై ఓ వార్త చక్కర్లు కొడుతుంది. క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. ధోనీ తాను రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు సీఎస్కే జట్టులో ఎవరికీ చెప్పలేదు. సీఎస్కే నిర్ణయాధికారులు అతన్ని కొనసాగించాలని కోరుతున్నారు. ధోనీ బ్యాటింగ్ చేసిన విధానం, అతను కచ్చితంగా రాబోయే కాలంలో కొనసాగగలడని సీఎస్కే ప్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథన్ చెప్పాడు. అయితే, అది ధోనీ ఇష్టంమీద ఆధారపడి ఉంటుందని తెలిపారు.

Also Read : RR vs KKR IPL 2024 : వర్షార్పణం.. రాజస్థాన్‌తో కోల్‌కతా మ్యాచ్ రద్దు.. ఎలిమినేటర్‌లో ఆర్సీబీతో తలపడే జట్టు ఇదే!

మరోవైపు రెండు నెలల తరువాత రిటైర్మెంట్ విషయంపై క్లారిటీ ఇస్తానని ధోనీ సీఎస్కే మేనేజ్ మెంట్ కు తెలిపినట్లు సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో.. వచ్చే ఐపీఎల్ సీజన్ లోనూ ధోనీ చెన్నై జెర్సీలో కనిపిస్తాడా..? అంతకుముందే ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అనే విషయం ఆసక్తికరంగా మారింది

 

 

 

ట్రెండింగ్ వార్తలు