ఐపీఎల్ లో ఆర్సీబీ సాధించలేనిది డబ్ల్యూపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అమ్మాయిల జట్టు సాధించింది. గత రాత్రి జరిగిన డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచులో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై గెలిచింది.
ఢిల్లీ ఇచ్చిన 114 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 19.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించి కప్ కొట్టేసింది. ఐపీఎల్ లో ఆర్సీబీ (మెన్స్ జట్టు) ఇప్పటివరకు కప్ గెలుచుకోలేదన్న విషయం తెలిసిందే. డబ్ల్యూపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న ఆర్సీబీ అమ్మాయిల జట్టుకు 6 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది.
రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు రూ.3 కోట్ల ప్రైజ్ మనీ దక్కించుకుంది. ఆర్సీబీ బ్యాటర్ ఎల్లీస్ పెర్రీ ఆరెంజ్ క్యాప్ గెలుచుకుని, ప్రైజ్ మనీగా 5 లక్షల రూపాయలను అందుకుంది. ఫైనల్ మ్యాచులో పెర్రీ 37 బంతుల్లో 35 పరుగులు చేసింది.
డబ్ల్యూపీఎల్ లో తొమ్మిది గేమ్లలో 347 పరుగులు చేసింది. సగటు 69.40గా నమోదైంది. ఫైనల్ మ్యాచులో స్మృతి మంధాన 31, సోఫీ డివైన్ 32, రిచా ఘోష్ 17 (నాటౌట్) పరుగులు చేశారు. ఆర్సీబీకి జై షా, విరాట్ కోహ్లీ, చాహల్, సెహ్వాగ్ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
RCB Womens : ఆర్సీబీ ఉమెన్స్ టీం విన్.. మెన్స్ టీంపై సోషల్ మీడియా ట్రోల్స్..