IND vs SA 2nd Test team India target is 549
IND vs SA : గౌహతి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. రెండో ఇన్నింగ్స్ను దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 260 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 288 పరుగులు కలుపుకుని దక్షిణాఫ్రికా జట్టు భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
సఫారీ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్ (94; 180 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. అతడు జడేజా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ కాగానే దక్షిణాఫ్రికా తమ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. టోని డి జోర్జి (49; 68 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), రికెల్టన్ (35), వియాన్ ముల్డర్ (35 నాటౌట్), మార్క్రమ్ (29) లు రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీయగా, వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ పడగొట్టాడు.
Innings Break!
South Africa have declared their innings on 260/5.#TeamIndia need 549 runs to win.
Scorecard ▶️ https://t.co/Hu11cnrocG#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/QCV3zea51c
— BCCI (@BCCI) November 25, 2025
అంతక ముందు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 489 పరుగులు చేసింది. ఆ తరువాత భారత్ 201 పరుగులకు ఆలౌటైంది.