బంగ్లాదేశ్తో జరగనున్న మూడు టీ20ల సిరీస్కు కోహ్లీకి విశ్రాంతి లభించనుంది. నవంబరు 3నుంచి జరగనున్న ఈ మ్యాచ్కు రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు వహించనున్నాడు. ఈ మేర బీసీసీఐ గురువారం 15మందితో కూడిన జాబితా విడుదల చేసింది.
జట్టులో కేరళ వికెట్ కీపర్ సంజు శాంసన్ స్థానం దక్కించుకున్నాడు. ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో శాంసన్ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఈ మూడు టీ20లకు విశ్రాంతి తీసుకోనున్న కోహ్లీ.. టెస్టు సిరీస్కు అందుబాటులోకి రానున్నాడు. నవంబరు 3న తొలి టీ20 న్యూఢిల్లీలో, రెండో టీ20 రాజకోట్లో నవంబరు 7న, మూడో టీ20 నాగ్ పూర్లో నవంబరు 10న జరగనుంది.
టెస్టు సిరీస్ ఇండోర్ వేదికగా నవంబరు 14న ఆరంభం కానుంది. రెండో టెస్టు నవంబరు 22న ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్నాయి. ఇప్పటికే వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ లో 240పాయింట్లతో ఉన్న టీమిండియా మరోసారి టెస్టు ఛాంపియన్ షిప్ లో ఎలాంటి విజయం దక్కించుకుంటుందో చూడాలి.
బంగ్లాదేశ్తో తలపడే టీ20 జట్టు: Rohit Sharma (c), Shikhar Dhawan, KL Rahul, Sanju Samson, Shreyas Iyer, Manish Pandey, Rishabh Pant (wk), Washington Sundar, Krunal Pandya, Yuzvendra Chahal, Rahul Chahar, Deepak Chahar, Khaleel Ahmed, Shivam Dube, Shardul Thakur
బంగ్లాదేశ్తో తలపడే టెస్టు జట్టు: Virat Kohli (c), Rohit Sharma, Mayank Agarwal, Cheteshwar Pujara, Ajinkya Rahane, Hanuma Vihari, Saha (wk), R Jadeja, R Ashwin, Kuldeep Yadav, Mohammed Shami, Umesh Yadav, Ishant Sharma, Shubman Gill, Rishabh Pant