Saina Nehwal : ‘కంగనా రనౌత్ ఆఫ్ స్పోర్ట్స్’ కామెంట్లపై సైనా నెహ్వాల్ కౌంటర్

జావెలిన్ త్రో అనేది ఒలింపిక్ క్రీడ అని తనకు తెలియదని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఇటీవల అన్నారు. 2021లో నీరజ్ చోప్రా ఒలింపిక్స్ లో బంగారు పతకాన్ని గెలుచుకున్నప్పుడు

Saina Nehwal

Saina Nehwal : జావెలిన్ త్రో అనేది ఒలింపిక్ క్రీడ అని తనకు తెలియదని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఇటీవల అన్నారు. 2021లో నీరజ్ చోప్రా ఒలింపిక్స్ లో బంగారు పతకాన్ని గెలుచుకున్నప్పుడు నాకు జావెలిన్ త్రో గురించి తెలిసిందని సైనా నెహ్వాల్ పాడ్‌కాస్ట్ సందర్భంగా చెప్పారు. సైనా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కొందరు నెటిజన్లు ఆమెను కంగనా రనౌత్ తో పోల్చారు. ‘కంగనా రనౌత్ ఆఫ్ స్పోర్ట్స్’ అని అభివర్ణించారు. నెటిజన్ల కామెంట్స్ పై తాజాగా సైనా నెహ్వాల్ స్పందించారు.

Also Read : Arshad Nadeem : వివాదంలో పాక్ ఒలింపిక్స్ స్వర్ణ విజేత అర్షద్ నదీమ్.. ఉగ్ర లింకులు ఉన్నాయా?

మీ కంప్లిమెంట్ కు ధన్యవాదాలు. కంగనా అందంగా ఉంది. కానీ నేను నా క్రీడలో పరిపూర్ణంగా ఉండాలి. నేను గర్వంగా నా దేశానికి బ్యాడ్మింటన్ లో ప్రపంచ నెం. 1 అయ్యి ఒలింపిక్ పతకాన్ని సాధించాను. మళ్లీ నేను చెబుతున్నాను.. ఇంట్లో కూర్చొని వ్యాఖ్యానించడం చాలా సులభం. కానీ, నీరజ్ మా సూపర్ స్టార్, అతను ఈ క్రీడను భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందాడు అని సైనా ఎక్స్ ఖాతాలో పేర్కొంది.

 

ట్రెండింగ్ వార్తలు