ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్వదేశంలో జరగనున్న పాకిస్తాన్తో టెస్టు సిరీస్ అనంతరం సుదీర్ఘ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. ఈ విషయాన్ని వార్నర్ ఎప్పుడో చెప్పాడు. అయితే.. ఆస్ట్రేలియా పరువు తీసిన వార్నర్ ఘన వీడ్కోలుకు అర్హుడు కాదంటూ ఆ జట్టు మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పెర్త్ వేదికగా పాక్తో జరగనున్న మొదటి టెస్టు కోసం క్రికెట్ ఆస్ట్రేలియా 14 మందితో కూడిన ఆసీస్ జట్టును ప్రకటించింది. ఇందులో వార్నర్కు చోటు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే జాన్సన్ను వ్యాఖ్యలు చేశాడు.
2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో బాల్ టాంపరింగ్ వివాదంలో డేవిడ్ వార్నర్ చిక్కుకున్నాడు. ఈ క్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) అతడిపై ఏడాది పాటు నిషేదం విధించింది. అంతేకాకుండా భవిష్యత్తులో ఆస్ట్రేలియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం లేకుండా చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్నే జాన్సన్ మరోసారి ప్రస్తావించాడు. వార్నర్కు వీడ్కోలు పలికేందుకు ఆస్ట్రేలియా సిద్ధం అవుతోందన్నాడు.
టెస్టుల్లో దారుణంగా విపలం అవుతున్న వార్నర్ కు రిటైర్మెంట్ డేట్ను ప్రకటించే అవకాశం ఎందుకు ఇచ్చారంటూ మండిపడ్డాడు. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అతిపెద్ద కుంభకోణంలో నిలిచిన ఓ ఆటగాడికి హీరోగా వీడ్కోలు పలకొద్దన్నాడు.
మొదటి టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు ఇదే : పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, నాథన్ లియాన్, మిచ్ మార్ష్, లాన్స్ మోరిస్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్