Ram Charan Meets MS Dhoni
Ram Charan Meets MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసిఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముంబయిలో వీరిద్దరు కలుసుకున్నారు. వీరిద్దరు కలిసి ఓ యాడ్ షూటింగ్ కోసం కలిసి పనిచేస్తున్నట్లు తెలిసింది. 2009లో రామ్ చరణ్, ఎంఎస్ ధోనీ కలిసి పెప్సీ యాడ్ షూట్ కోసం పనిచేసిన విషయం తెలిసిందే.
మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల సంఖ్య ఎక్కువే. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోనీ నాయకత్వం వహిస్తున్నాడు. ఐపీఎల్ తరువాత తన వ్యాపార విస్తరణలో ధోనీ బిజీబిజీగా ఉంటున్నాడు. మరోవైపు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బుధవారం ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చరణ్కు ఆలయ పూజారులు శాలువాతో సత్కరించారు. టాలీవుడ్ లో అగ్రహీరోల్లో ఒకరిగా ఉన్న రామ్ చరణ్ కు కూడా అభిమానుల సంఖ్య ఎక్కువే. దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత చరణ్ నటనకు దేశంలోనేకాక ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల సంఖ్య పెరిగింది.
Read Also : MS Dhoni : క్రికెట్ మైదానంలోనే కాదు.. టెన్నిస్ కోర్టులోనూ ధోనీ మెరుపులు.. వీడియో వైరల్
2009లో ధోనీ, రాం చరణ్ నటించిన పెప్సీ యాడ్ కు మంచి ఆదరణ లభించింది. ఈ ఇద్దరు మళ్లీ కలిసి నటించాలని ఫ్యాన్స్ కూడా పలుసార్లు ప్రస్తావించారు. ధోనీ బయోపిక్ సినిమాలో సురేష్ రైనా పాత్రలో చరణ్ నటిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, అవి పుకార్లేనని తేలాయి. సుదీర్ఘకాలం తరువాత వీరిద్దరు మళ్లీ ఓ యాడ్ లో నటించేందుకు సిద్ధమయ్యారట. దీంతో ఇరువురి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరు కలిసి నటించే యాడ్ ఎప్పుడొస్తుందా అని ఇప్పటి నుంచే ఆరాతీయడం మొదలు పెట్టారు.
Star of Indian cinema Ram Charan meets MS Dhoni. pic.twitter.com/EkAoVW2vJW
— Johns. (@CricCrazyJohns) October 4, 2023