Shreyas Iyer need 34 runs to become the quickest Indian batter to reach 3000 runs in terms of innings
Shreyas Iyer : న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భారత్ శుభారంభం చేసింది. వడోదర వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో విజయం సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక రెండో వన్డే మ్యాచ్ రాజ్ కోట్ వేదికగా బుధవారం (జనవరి 14) జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
2017లో శ్రేయస్ అయ్యర్ అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు అతడు 74 మ్యాచ్లు ఆడాడు. 68 ఇన్నింగ్స్ల్లో 47.8 సగటుతో 2966 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Mohammad Nabi : క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. కొడుకుతో కలిసి ఆడడంపై నబీ కామెంట్స్..
ఇక రాజ్కోట్ వన్డేలో అతడు 34 పరుగులు చేస్తే.. వన్డేల్లో 3 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. అంతేకాదండోయ్.. టీమ్ఇండియా తరుపున అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు శిఖర్ ధావన్ పేరిట ఉంది. ధావన్ 72 ఇన్నింగ్స్ల్లో 3వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఇక కోహ్లీ 75 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత సాధించి రెండో స్థానంలో ఉన్నాడు.
వన్డేల్లో అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన భారత ఆటగాళ్లు వీరే..
* శిఖర్ ధావన్ – 72 ఇన్నింగ్స్లు
* విరాట్ కోహ్లీ – 75 ఇన్నింగ్స్లు
* కేఎల్ రాహుల్ – 78 ఇన్నింగ్స్లు
* నవజ్యోత్ సిద్ధూ – 79 ఇన్నింగ్స్లు
* సౌరవ్ గంగూలీ – 82 ఇన్నింగ్స్లు
ఇక వన్డేల్లో అత్యంత వేగంగా మూడు వేల పరుగుల మైలురాయిని చేరుకున్న రికార్డు దక్షిణాఫ్రికా దిగ్గజం హషీమ్ ఆమ్లా పేరిట ఉంది. ఆమ్లా 57 ఇన్నింగ్స్లలో ఈ మైలురాయిని చేరుకున్నాడు. షై హోప్, ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్ లు 67 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత అందుకున్నారు. బాబర్ ఆజామ్ 68 ఇన్నింగ్స్ల్లో ఈ మైలురాయిని చేరుకున్నాడు.