SRH captain Pat Cummins : ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. అభిషేక్ శర్మ బ్యాటింగ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్ జట్టు మంచి శుభారంభం చేసింది. ఉప్పల్ స్టేడియం పిచ్ భిన్నమైనది. ఆట సాగుతున్నా కొద్దీ వికెట్ నెమ్మదించింది. శివమ్ దూబే స్పిన్నర్ల బౌలింగ్ లో వేగంగా పరుగులు రాబట్టాడు. దీంతో మేము అతనికి ఆఫ్ కట్టర్లను ఉపయోగించామని కమిన్స్ చెప్పాడు.
Also Read : ముంబై జట్టు గెలవాలి స్వామీ..!! సోమనాథ్ ఆలయంలో హార్దిక్ పాండ్యా పూజలు.. వీడియోలు వైరల్
ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ల గురించి మాట్లాడుతూ.. నేను వారికి బౌలింగ్ చేయాలని అనుకోను అంటూ కమిన్స్ వ్యాఖ్యానించాడు. వారు విధ్వంసకరమైన బ్యాటింగ్ చేస్తున్నారు. ప్ర్రారంభంలో పరుగులు రాబట్టడంలో కీలక భూమిక పోషిస్తున్నారు. అభిషేక్ శర్మ గురించి చెప్పాల్సిన పనిలేదు. అతని ఈ మ్యాచ్ లో 12 బంతుల్లో 37 పరుగులు చేశాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడి పవర్ ప్లేలో భారీ స్కోర్ చేయడంలో కీలక భూమిక పోషించాడని కమిన్స్ కొనియాడారు. ధోనీ గురించి మాట్లాడుతూ.. ఉప్పల్ స్టేడియంలో ప్రేక్షకులు ధోనీ పిచ్చిలో ఉన్నారు. ధోనీ బ్యాటింగ్ కు వస్తున్నప్పుడు నేను ఎప్పుడూ విననంత పెద్ద శబ్దం విన్నాను అంటూ కమిన్స్ పేర్కొన్నాడు.
Also Read : IPL 2024 : ధోనీ బ్యాట్తో మైదానంలోకి అడుగుపెట్టగానే అభిమానులు ఏం చేశారో తెలుసా.. వీడియోలు వైరల్
Pat Cummins said, "I would not want to be bowling to Abhishek Sharma (smiles)". pic.twitter.com/Muy5dAC5Rs
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 5, 2024