IND vs ENG : ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-2025 సైకిల్ లో ఫైనల్కు చేరుకోవాలంటే ఇంగ్లాండ్తో జరగనున్న ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ భారత్కు ఎంతో కీలకం. ఈ క్రమంలో గురువారం నుంచి హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మొదటి టెస్టు మ్యాచ్ జరగనుంది. చాలా రోజుల తరువాత ఉప్పల్ మైదానం టెస్టులకు ఆతిథ్యం ఇస్తోంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించాలని చాలా మంది అభిమానులు భావిస్తున్నారు. ఈ క్రమంలో క్రికెట్ అభిమానులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ) శుభవార్త చెప్పింది.
హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మ్యాచ్ జరిగే ఉప్పల్ స్టేడియానికి 60 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు వెల్లడించింది. మ్యాచ్ జరిగే ఐదు రోజుల పాటు ఈ బస్సులు నడవనున్నాయి. ఈ బస్సులు ప్రతి రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. అనంతరం రాత్రి 7 గంటల వరకు స్టేడియం నుంచి ఈ బస్సులు బయలుదేరనున్నాయి. మ్యాచ్ను ప్రత్యక్షంగా చూడాలనే ఫ్యాన్స్ ఈ ప్రత్యేక బస్సుల సర్వీస్ను ఉపయోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.
భారత్, ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్.. ఉదయం 6.30 నుంచే ఉప్పల్ స్టేడియంలోకి అనుమతి
బస్సుల రూట్ల వివరాలు ఇవే..
IND vs ENG : ఇంగ్లాండ్తో టెస్టులు.. కోహ్లీ స్థానంలో ఆర్సీబీ ప్లేయర్కే ఛాన్స్..!
క్రికెట్ అభిమానులకు శుభవార్త! ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో రేపటి నుంచి ఐదు రోజుల పాటు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా #TSRTC ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. #Hyderabad లోని వివిధ ప్రాంతాల నుంచి స్టేడియానికి 60 బస్సులను నడుపుతోంది. ప్రతి రోజు ఉదయం… pic.twitter.com/wj0Xv0U9F6
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) January 24, 2024