Virat Kohli
Virat Kohli : ఇంగ్లాండ్తో ఐదు టెస్టు మ్యాచుల సిరీస్కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలింది. మొదటి, రెండు టెస్టు మ్యాచులకు పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ దూరం అయ్యాడు. వ్యక్తిగత కారణాలతో అతడు ఈ రెండు టెస్టు మ్యాచులను ఆడడం లేదు. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వెల్లడించింది. టీమ్ మేనేజ్మెంట్, సెలక్టర్లు, కెప్టెన్ రోహిత్ శర్మకు ఇప్పటికే ఈ విషయాన్ని కోహ్లీ తెలియజేసినట్లు బీసీసీఐ చెప్పింది.
దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎల్లప్పుడూ తన మొదటి ప్రాధాన్యం అని ఇప్పటికే కోహ్లీ పలుమార్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. వ్యక్తిగత కారణాలతో తప్పనిసరి పరిస్థితుల్లో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. ‘ఈ విషయమై ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ, టీమ్ మేనేజ్మెంట్, సెలక్టర్లతో కోహ్లీ మాట్లాడాడు. అతడి నిర్ణయాన్ని వారంతా గౌరవించారు.’ అంటూ బీసీసీఐ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. కాగా.. అతడి స్థానంలో వేరొక ఆటగాడిని త్వరలోనే ఎంపిక చేయనున్నట్లు చెప్పింది.
హైదరాబాద్ వేదికగా జనవరి 25 నుంచి టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ఇప్పటికే బీసీసీఐ మొదటి రెండు టెస్టు కోసం జట్టును ప్రకటించింది. జనవరి 25న ఉప్పల్ మైదానంలో మొదటి టెస్టు, ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నంలో రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ రెండు టెస్టుల్లో ప్రత్యక్షంగా కోహ్లీ విన్యాసాలు చూద్దామని భావించిన తెలుగు ప్రేక్షకులను నిరాశ తప్పడం లేదు.
మొదటి రెండు టెస్టులకు భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్.
Rohit Sharma : ధోనిదా?, సెహ్వాగ్దా?.. ఈ ఇద్దరిలో రోహిత్ శర్మ ఎవరి బాక్స్ బద్దలు కొడతాడో..!
🚨 NEWS 🚨
Virat Kohli withdraws from first two Tests against England citing personal reasons.
Details 🔽 #TeamIndia | #INDvENGhttps://t.co/q1YfOczwWJ
— BCCI (@BCCI) January 22, 2024