Redmi Pad Android Tablet : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) సబ్-బ్రాండ్ కింద బడ్జెట్ టాబ్లెట్ను లాంచ్ చేయనుంది. ఈ డివైజ్ Redmi Pad ఆండ్రాయిడ్ ట్యాబ్ పేరుతో రానుంది. ప్రపంచవ్యాప్తంగా.. కొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్ వచ్చే నెలలో లాంచ్ కానున్నట్టు వెల్లడించింది.
Xiaomi, Redmi ఆండ్రాయిడ్ మార్కెట్ వాటాతో భారతీయ మార్కెట్లోకి రానుంది. Xiaomi దేశంలో ఇప్పటికే బడ్జెట్ టాబ్లెట్లను అందించే Realme, Nokia, Oppo, Samsung వంటి రివల్ బ్రాండ్లకు రెడీగా ఉందని తెలుస్తోంది. Xiaomi Redmi బ్రాండ్ రూ. 20వేల మార్క్ రెడ్మి ప్యాడ్ ధర ఉండే అవకాశం ఉంది.
రెడ్మీ ప్యాడ్ గ్రాఫైట్ గ్రే, మింట్ గ్రీన్, మూన్లైట్ సిల్వర్ అనే మూడు కలర్ ఆప్షన్లలో వస్తుంది. Redmi Pad రెండు స్టోరేజ్ ఆప్షన్లలో (3GB RAM + 64GB స్టోరేజీ, 4GB RAM + 64GB స్టోరేజీ) అందుబాటులోకి రానుంది. కంపెనీ మరింత ప్రీమియం Xiaomi ప్యాడ్ 5 సేల్తో డివైజ్ లాంచ్ను ప్లాన్ చేస్తోందని సూచిస్తోంది.
భారత మార్కెట్లో 256GB స్టోరేజీతో అందుబాటులో ఉంది. Xiaomi కువైట్ సోషల్ మీడియాలో పోస్ట్ను షేర్ చేసింది. రెడ్మీ ప్యాడ్ డిజైన్ను రివీల్ చేసింది. MySmartPriceలో స్క్రీన్షాట్ ప్రకారం.. Android టాబ్లెట్ వెనుక భాగంలో బ్లాక్ కెమెరా మాడ్యూల్ ఉంది.
కొన్ని లీక్ల ప్రకారం.. Redmi Pad 5 2K రిజల్యూషన్తో 11.2-అంగుళాల LCD స్క్రీన్, MediaTek MT8781 చిప్సెట్, 22.5W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్టుతో 7,800mAh బ్యాటరీని కలిగి ఉంది. వెనుకవైపు 8-MPని కలిగి ఉండవచ్చు. ప్రస్తుతానికి, Xiaomi ఇండియా Redmi ప్యాడ్ లాంచ్ను ఇంకా ధృవీకరించలేదు. దీపావళితో పాటు Mi సేల్స్లో భాగంగా కంపెనీ స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లపై సేల్ ఆఫర్లను ప్రకటించింది.
Read Also : Xiaomi Redmi Phones : రెడ్మి నుంచి రెండు కొత్త బడ్జెట్ ఫోన్లు వస్తున్నాయి.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?