5G Smartphones : భారతదేశానికి 5G నెట్వర్క్ వస్తోంది. 5G స్పెక్ట్రమ్ వేలం తేదీని ప్రకటించారు. దేశంలో 5G నెట్వర్క్ కోసం టెలికాం ఆపరేటర్లకు స్పెక్ట్రమ్ను కేటాయించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) స్పెక్ట్రమ్ వేలానికి అనుమతినిచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో 5G స్పెక్ట్రమ్ వేలానికి ఆమోదం లభించింది. 5జీ స్పెక్ట్రమ్ వేలం జూలై చివరి నాటికి జరగనుంది. టెలికాం ఆపరేటర్ల ద్వారా కమర్షియల్ 5G నెట్వర్క్ ఆవిష్కరణకు అధికారిక తేదీ వెల్లడించలేదు. ఇండియాలో 5G నెట్వర్క్ ఈ ఏడాది చివర్లో జరుగుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. దేశంలో 5G నెట్వర్క్ అందుబాటులోకి రాగానే ప్రతి ఒక్కరూ వెంటనే 5Gని యాక్సెస్ చేసుకోలేరు.
పరిమిత నగరాల్లోనే 5G నెట్ వర్క్..
DoT ప్రకారం.. 5G ఇండియాలోని 13 ప్రధాన నగరాల్లో మాత్రమే అందుబాటులోకి రానుంది. అందులో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా, చెన్నై, అహ్మదాబాద్, చండీగఢ్, గాంధీనగర్, గురుగ్రామ్, జామ్నగర్, హైదరాబాద్, పూణె లక్నో ఉన్నాయి. మరిన్ని నగరాలు, గ్రామీణ ప్రాంతాలు తుది జాబితాలో యాడ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో భారత్లో 5G స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయాలా అనే లేదా అనే ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది.
ఇండియాలో 5G స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయాలా? వద్దా? :
భారత్లో 5G నెట్వర్క్ ప్రవేశపెట్టిన వెంటనే మొత్తం జనాభాకు 5G నెట్వర్క్ అందుబాటులో ఉండదు. ఇప్పుడు 5G స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయడం అనేది పూర్తిగా రెండింటిపై ఆధారపడి ఉంటుంది. అందులో ఒకటి మీరు నివసిస్తున్న సిటీలో 5G అందుబాటులో ఉండాలి. మొదటి దశలో మీ నగరం ఉంటే 5G యాక్సస్ చేసుకోగలరు. మీరు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, గురుగ్రామ్, చెన్నై, పూణే నగరాల్లో ఉంటే.. మీరు 5G ఫోన్ కలిగి ఉంటే.. నెక్స్ట్ జనరేషన్ నెట్వర్క్ను యాక్సస్ చేసుకోగలరు. బడ్జెట్ 5G స్మార్ట్ఫోన్లు 5G నెట్వర్క్ సపోర్టును అందిస్తాయి. అందులో ముఖ్యంగా కెమెరా, డిస్ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ మొదలైన ఇతర ఫీచర్లను అందిస్తుంటాయి. మీ ప్రస్తుత అవసరాలను తీర్చడంలో 4G స్మార్ట్ఫోన్ 5G ఫోన్ కన్నా మెరుగైనదని గుర్తించాలి. మీరు ఈ పాయింట్లన్నింటినీ విశ్లేషించిన తర్వాత 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలా లేదా అనేది నిర్ణయం తీసుకోండి.
5G నెట్ వర్క్ చౌకగా రాదు :
5G చౌకగా రాదని మీరు గుర్తించాలి. టెలికాం ఆపరేటర్లు దేశవ్యాప్తంగా 5G నెట్వర్క్లను టెస్టింగ్ చేసేందుకు భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టారు. దేశంలో వివిధ 5G రీఛార్జ్ ప్లాన్ల ధరలు ఇప్పటికీ తెలియదు. ఎయిర్టెల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO), రణదీప్ సెఖోన్, దేశంలో 5G ప్లాన్లు ప్రస్తుతం మనం చెల్లిస్తున్న 4G ప్లాన్లకు సమానమైన ధరను కలిగి ఉంటాయని చెప్పారు. టెలికాం ఆపరేటర్లు కస్టమర్లను ఆన్బోర్డ్లోకి తీసుకురావడానికి తగ్గింపు ధరతో 5G రీఛార్జ్ ప్లాన్లను అందించే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత 4G ప్లాన్ల మాదిరిగానే, కస్టమర్లు హై-స్పీడ్ డేటాకు అలవాడతారు. అప్పటినుంచి ధరల పెంపు మరింత ఉండవచ్చు.
ముందుగా ఏ టెలికాం ఆపరేటర్ 5G రిలీజ్ చేస్తుందంటే? :
వివిధ నగరాల్లో 5G నెట్వర్క్ టెస్టులను నిర్వహించడానికి టెలికాం ఆపరేటర్లకు DoT అనుమతి ఇచ్చింది. 5G నెట్వర్క్ను ప్రవేశపెట్టడంలో పోటీ గత ఏడాదిలోనే ప్రారంభమైంది. రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ ఎంపిక చేసిన ప్రాంతాలలో పరిమిత సామర్థ్యంతో టెస్టులు నిర్వహించేందుకు అనుమతి లభించింది. టెలికాం ఆపరేటర్లు కూడా టెస్టింగ్ కోసం స్వదేశీ 5G గేర్ను ఉపయోగించాలని సూచించారు. రాబోయే స్పెక్ట్రమ్ వేలంలో తక్కువ, మధ్య అధిక ఫ్రీక్వెన్సీ బ్యాండ్లు ఉండనున్నాయి. 20 ఏళ్ల వ్యాలిడిటీతో 72097.85 MHz స్పెక్ట్రమ్ని జులై చివరి నాటికి వేలానికి ఉంచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
వీటిలో 600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 3300 MHz 26 GHz ఉన్నాయి. టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది చివర్లో వాణిజ్యపరంగా 5G నెట్వర్క్ను ఆవిష్కరిస్తామని నివేదికలు సూచిస్తున్నాయి. వాణిజ్య ఉపయోగం కోసం దేశంలో 5G నెట్వర్క్ ఆగస్టు 15 నుంచి అధికారికంగా అందుబాటులోకి వస్తుందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అయితే, స్పెక్ట్రమ్ వేలం టైమ్లైన్ తేదీపై క్లారిటీ లేదు. ఈ సంవత్సరం చివరి నాటికి టెల్కోలు 5G నెట్వర్క్ను లాంచ్ చేసే అవకాశం కనిపిస్తోంది.
Read Also : 5G Network : అతి త్వరలోనే ఇండియాకు 5G.. ఆ 13 నగరాల్లోనే ఫస్ట్.. ఎక్కడెక్కడంటే?