Google Employees : రాబోయే రోజుల్లో గూగుల్ ఉద్యోగులకు ఇంటర్నెట్ పనిచేయదు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Google Employees : గూగుల్ తమ ఉద్యోగుల విషయంలో కఠినమైన నిర్ణయాలను తీసుకోనుంది. రాబోయే రోజుల్లో చాలామంది గూగుల్ ఉద్యోగులకు ఇంటర్నెట్ సదుపాయం లేకుండా చేయనుంది. గూగుల్ ఎందుకు ఇలా చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
- Sreehari A
- Published On : July 19, 2023 / 07:07 PM IST
Some Google employees will not have internet access in the coming days
Google Employees : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) కొంతమంది ఉద్యోగులకు గూగుల్ ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపివేస్తోంది. ఇప్పుడు ఇంటర్నెట్ లేకుండా గూగుల్ ఉద్యోగులు ఎలా వర్క్ చేస్తారని అనుకుంటున్నారా? సైబర్ దాడుల నుంచి తమ ఉద్యోగులను రక్షించడానికే గూగుల్ ఇంటర్నెట్ యాక్సెస్ రద్దు చేస్తోంది. గూగుల్ తన ఉద్యోగుల కంప్యూటర్లను మరింత సురక్షితంగా ఉంచేందుకు సరికొత్త ప్రోగ్రామ్ను ప్రారంభిస్తోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా కొంతమంది ఉద్యోగులకు ఇంటర్నెట్ సదుపాయం లేని డెస్క్టాప్ కంప్యూటర్లను అందించనుంది. ఈ కంప్యూటర్లను ఉపయోగిస్తున్నప్పుడు ఉద్యోగులు ఇతర వెబ్సైట్లను బ్రౌజ్ చేయలేరు. అలాగే, ఆన్లైన్ సర్వీసులను ఉపయోగించలేరు. అయినప్పటికీ, గూగుల్ ఉద్యోగులు ఇప్పటికీ ఇంటర్నల్ టూల్స్ సాయంతో Google Drive, Gmail వంటి గూగుల్ సొంత వెబ్సైట్లను యాక్సస్ చేయగలరు. గూగుల్ తమ ఉత్పత్తులు, యూజర్ల భద్రతపై అధిక ప్రాధాన్యతనిస్తుంది.
CNBC ప్రకారం.. గూగుల్ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 2,500 మంది ఉద్యోగులను ఎంపిక చేసింది. అయితే, ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేసింది. ఇప్పుడు, గూగుల్ ఉద్యోగులు ఈ ప్రోగ్రామ్లో భాగం కావాలో వద్దో ఎంచుకోవచ్చు. ఆసక్తి ఉంటే స్వచ్ఛందంగా ఇందులో చేరవచ్చు. ఇంటర్నెట్ సదుపాయం అవసరమయ్యే ఉద్యోగులు ఇప్పటికీ ఉపయోగించగలరని కంపెనీ నిర్ధారించుకోవాలని సూచిస్తోంది.
కాబట్టి, కొంతమంది ఉద్యోగులు ఇంటర్నెట్ పరిమితుల నుంచి మినహాయింపు పొందుతారు. లిమిటెడ్ ఇంటర్నెట్ సదుపాయంతో పాటు, కొంతమంది ఉద్యోగులు తమ కంప్యూటర్లలో ఏమి చేయాలనే దానిపై కూడా పరిమితులు ఉంటాయి. ఆయా యూజర్లకు అడ్మినిస్ట్రేటివ్ అధికారాలు ఉండవు. గూగుల్ ప్రత్యేక ఆదేశాలను అమలు చేయడం లేదా సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేయడం వంటి నిర్దిష్ట పనులను చేయలేరు.
Google employees will not have internet access in the coming days
తమ ఉద్యోగులను తరచుగా హ్యాకర్లు టార్గెట్ చేస్తున్నారని గూగుల్ చెబుతోంది. గూగుల్ ఉద్యోగి వినియోగించే కంప్యూటర్ హ్యాక్ అయితే.. హ్యాకర్లు ముఖ్యమైన సమాచారానికి యాక్సెస్ను పొందే ప్రమాదం పొంచి ఉంది. ఇంటర్నెట్ యాక్సెస్ని పరిమితం చేయడం ద్వారా, హ్యాకర్లు డేంజరస్ కోడ్ని ఇంజెక్ట్ చేయడం కుదరదు. అలాగే, రిమోట్గా డేటాను దొంగిలించకుండా నిరోధించడమే కంపెనీ లక్ష్యంగా చెబుతోంది.
అనేక కంపెనీలు అధునాతన సైబర్టాక్లను ఎదుర్కొంటున్న సమయంలో గూగుల్ ఈ కొత్త ప్రోగ్రామ్ తీసుకొస్తోంది. అమెరికా, యూరప్లోని ప్రభుత్వ ఏజెన్సీల ఇమెయిల్ అకౌంట్లను చైనీస్ హ్యాకర్లు ఉల్లంఘించినట్లు ఇటీవల మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ముఖ్యంగా కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ను ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్న సమయంలో గూగుల్ భద్రతా చర్యలను పటిష్టం చేయాలని కోరుతోంది. డేటా లీక్లను నిరోధించడంలో కూడా గూగుల్ కృషి చేస్తోంది.
తమ ఉత్పత్తులు, వినియోగదారుల భద్రతకు అధిక ప్రాధాన్యతనిచ్చారని గూగుల్ ప్రతినిధి ఒకరు ఉద్ఘాటించారు. తమ ఇంటర్నల్ సిస్టమ్లను మెరుగుపరచడానికి డేంజరస్ దాడుల నుంచి ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆయా మార్గాలను క్రమం తప్పకుండా సెర్చ్ చేస్తుంటారు. కొంతమంది ఉద్యోగులు సెక్యూరిటీని మెరుగుపరచడానికి, సైబర్టాక్లను నిరోధించడానికి ఇంటర్నెట్ యాక్సెస్ లేకుండా కంప్యూటర్లను ఉపయోగించే ప్రోగ్రామ్ను గూగుల్ ప్రారంభిస్తోంది.
ఈ ప్రొగ్రామ్లో ఉద్యోగులు పాల్గొనే అవకాశాన్ని గూగుల్ అందిస్తోంది. తమ పనుల కోసం ఇంటర్నెట్ సదుపాయం అవసరమయ్యే ఉద్యోగులు ఇప్పటికీ ఇంటర్నెట్ కలిగి ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇతర ఆన్లైన్ బెదిరింపుల నుంచి ఉద్యోగులు, యూజర్ డేటాను ప్రొటెక్ట్ చేయడమే గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది.
