40 women arrested at Shamshabad airport : హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో నకిలీ వీసాల కలకలం రేపింది. కువైట్ వెళ్లేందుకు 40 మంది మహిళలు ప్రయత్నం చేశారు. వీసాలను పరిశీలించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు..ఆ వీసాలు ఫేక్ అని గుర్తించారు.
వెంటనే ఆ 40 మంది మహిళలను ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించారు. పోలీసులు మహిళలను ప్రశ్నిస్తున్నారు. ఫేక్ వీసాలతో పట్టుబడిన మహిళలను తమిళనాడు, గోవా, తెలంగాణ, ఏపీకి చెందిన వారిగా అధికారులు గుర్తించారు.
Farmer Dead : ధాన్యం కొనుగోలు కేంద్రంలో గుండెపోటుతో రైతు మృతి
తదుపరి విచారణ కోసం ఆర్జీఐ పోలీసులకు అధికారులు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. మహిళలను ఏజెంట్ మోసం చేశాడా? లేదా ఉద్దేశపూర్వకంగానే వెళ్తున్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.