రాహుల్ గాంధీ వస్తే నేనే రిసీవ్ చేసుకుంటా, సీఎం రేవంత్ స్వగ్రామానికి తీసుకెళ్తా- హరీశ్ రావు

100 శాతం రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారు. మీ మంత్రులు, ఎమ్మెల్యేలే రుణమాఫీ జరగలేదని అంటున్నారు.

BRS MLA Harish Rao

Harish Rao : సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీశ్ రావు. రేవంత్ రెడ్డి చేసేది చిట్ చాట్ కాదు.. చీట్ చాట్ అని మండిపడ్డారు. ఢిల్లీలో చిట్ చాట్ చేస్తూ ఓల్డ్ సిటీ విద్యుత్ బకాయిలను అదానీకి అప్పగిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో మేము అడిగితే మేమెక్కడ అన్నామని అంటున్నారు. అబద్దాలు చెబుతూ గోబెల్స్ ను ప్రచారం చేస్తున్నారు.

రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు హరీశ్ రావు. రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి గజదొంగ అని విరుచుకుపడ్డారు. 100 శాతం రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. మీ మంత్రులు, ఎమ్మెల్యేలే రుణమాఫీ జరగలేదని అంటున్నారని హరీశ్ రావు విరుచుకుపడ్డారు. రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే అధికారులపై పేపర్లు విసిరేశారని చెప్పారు. రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారని హరీశ్ రావు వెల్లడించారు.

”ఆగస్టు 15లోగా ఎందుకు రుణమాఫీ చేయలేకపోయారు? నేను విసిరిన ఛాలెంజ్ అదే. 50 లక్షల రూపాయలు ఇస్తూ దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి. ఢిల్లీలో రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారు. రాహుల్ గాంధీ ఎప్పుడు హైదరాబాద్ వస్తారో చెప్పాలి. నేను ఎయిర్ పోర్టుకు వెళ్లి రాహుల్ గాంధీని రిసీవ్ చేసుకుని రుణమాఫీ అయిందో లేదో చెప్పడానికి సీఎం రేవంత్ సొంత గ్రామానికి తీసుకువెళ్తా. వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినట్లు 20 లక్షల మందికి రుణమాఫీ కాలేదు” అని హరీశ్ రావు అన్నారు.

Also Read : నెక్ట్స్ టార్గెట్ ఏంటి? హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..

”తెలంగాణ తల్లికి రూపం ఇచ్చింది కేసీఆర్. కేసీఆర్ ఆనవాళ్ళపై రేవంత్ రెడ్డి నిలబడ్డారు. సీఎం స్థాయిలో ఉండి సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టడం నేరం. వక్రబుద్ది ఉంటే అన్నీ వంకరగా కనిపిస్తాయి. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ బీజేపీ ఇస్తేనే వచ్చిందా…? సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. కవిత బెయిల్ విషయంలో న్యాయం, ధర్మం గెలిచాయి. ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సిసోడియాకు బెయిల్ వస్తే బీజేపీతో పోరాటం.. కవితకు బెయిల్ వస్తే బీజేపీతో లాలూచీనా…? ఫోర్త్ సిటీ పేరుతో ప్రభుత్వ భూములు కొల్లగొట్టే కుట్ర జరుగుతోంది. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు బయటపెడతా” అని హరీశ్ రావు అన్నారు.

ట్రెండింగ్ వార్తలు