కేఆర్ఎంబీపై తెగించి కొట్లాడదామని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లను తిప్పికొట్టారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో కేసీఆర్ మాట్లాడారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేఆర్ఎంబీ పరిధిలోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని అన్నారు. అయితే, అందుకు తాము అంగీకరించలేదని చెప్పారు. ఆయా ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకోవాలనుకుంటే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేసి తీసుకోవాలని చెప్పామన్నారు. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలని చెప్పారు.
తమ పోరాటం ఒక్కరిపై కాదన్నారు. ఈ నెల 13న నల్లగొండలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు. అయిదు జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ చేయాలని చెప్పారు.
కేసీఆర్ కామెంట్స్
YCP: హిందూపురం వైసీపీ గ్రూప్ రాజకీయాలతో అధినేత సతమతం.. ఏం జరుగుతుందో తెలుసా?