mahesh kumar goud
టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. అంతకుముందు మహేశ్ కుమార్ గౌడ్ దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
గన్పార్క్ అమరవీరుల స్థూపం వద్ద మహేశ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. గన్పార్క్ నుంచి భారీ ఎత్తున ర్యాలీగా గాంధీ భవన్కు బయలుదేరారు. పెద్ద ఎత్తున వాహనాలు, గుర్రపు బగ్గీలు, ఒంటెలు, ఆదివాసీల నృత్యాలు, బోనాలు, శివ సత్తుల ప్రదర్శనలతో భారీ ర్యాలీ జరిగింది.
అలాగే, మహేశ్ కుమార్ గౌడ్ నివాసంలో ఆయనకు టీటీడీ వేదపండితుల ఆశీర్వచనాలు ఇచ్చారు. మహేశ్ కుమార్ గౌడ్ తెలంగాణ కాంగ్రెస్ 4వ పీసీసీ అధ్యక్షుడు. కాగా, గాంధీ భవన్లో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ సెక్రటరీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. మొత్తం 350 మందికి ఆహ్వానం అందగా వారిలో చాలా మంది పాల్గొన్నారు.
మహేశ్ కుమార్ గౌడ్ రాజకీయ ప్రస్థానం
Roja : ఏపీ ప్రభుత్వంపై రోజా విమర్శలు.. వాటిని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్