Rain In Telangana : తెలంగాణలో రాగల మూడు రోజులు తేలికపాటి వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ఈరోజు మధ్య చత్తీస్ఘడ్ నుండి తెలంగాణ మరియు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి మీ
- chvmurthy
- Published On : April 16, 2022 / 12:39 PM IST
Rains In Telangana
Rain In Telangana : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ఈరోజు మధ్య చత్తీస్ఘడ్ నుండి తెలంగాణ మరియు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి మీ ఎత్తు వద్ద కొనసాగుతోంది.
దీని ప్రభావం వలన రాగల మూడు రోజులు తెలంగాణలో కొన్ని జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓమోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వర్షం పడే సమయంలో గాలి వేగం గంటకు 30నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తుంటుందని అధికారులు తెలిపారు.
Also Read : Tirupati Hospital : తిరుపతి ఆస్పత్రిలో మరణ మృదంగం..వారంలో తొమ్మిది శిశువులు మృతి
