Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఈ నెల 22న ఖాతాల్లోకి డబ్బులు
మూడు విడతల్లో కలిపి మొత్తంగా రైతుల ఖాతాల్లోకి సుమారు రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు జమ కానున్నాయి.
Rythu Bharosa Funds Representative Image (Image Credit To Original Source)
Rythu Bharosa: తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా మొదటి విడత నిధుల విడుదల తేదీ ఖరారు చేసింది. ఈ నెల 22న రైతు భరోసా మొదటి విడత నిధులు విడుదల చేయనుంది. సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి రైతు భరోసా నిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిలీజ్ చేయనున్నారు.రైతు భరోసా నిధుల విడుదలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు.
తొలి విడతగా మొత్తం 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒక ఎకరం వరకు రైతు భరోసా కింద రూ.3,590 కోట్లు బదిలీ చేయనున్నారు. రెండో విడతగా మరో 20 రోజుల తర్వాత రూ.2,650 కోట్లు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడతగా మొత్తం రైతు భరోసా నిధులు రిలీజ్ చేయనున్నారు. మూడు విడతల్లో కలిపి మొత్తంగా రైతుల ఖాతాల్లోకి సుమారు రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు జమ కానున్నాయి.
