కరోనా కేసులు పెరుగుతున్నాయి.. అయినా..ఆసుపత్రులకు తగ్గుతున్న రద్దీ..ఫీజుల ఎఫెక్ట్

  • Published By: madhu ,Published On : August 28, 2020 / 10:39 AM IST
కరోనా కేసులు పెరుగుతున్నాయి.. అయినా..ఆసుపత్రులకు తగ్గుతున్న రద్దీ..ఫీజుల ఎఫెక్ట్

Updated On : August 28, 2020 / 11:52 AM IST

కరోనా కేసులు పెరుగుతున్నాయి..కానీ..ఆసుపత్రులకు మాత్రం రోగులు రావడం లేదు. ఇళ్లలోనే చికిత్స పొందుతున్న వారు 14 శాతం పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో నెల రోజుల్లో 21 శాతం ఇన్ పేషెంట్లు తగ్గుతున్నారు. ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల్లో 53 శాతం పడకలు ఖాళీగా ఉన్నాయి. సీరియస్ అయితే..తప్ప జనాలు ఆసుపత్రులకు రావడం లేదు. టెలీ కన్సల్టేషన్, టెలీ మెడిసన్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. పరిస్థితిపై సర్కార్ కు వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక సమర్పించింది.



జూన్ 27వ తేదీ నాటికి రాష్ట్రంలో కేసుల సంఖ్య 57,142… సరిగ్గా నెలకు అంటే ఈ నెల 26వ తేదీ నాటికి కేసుల సంఖ్య రెండింతలు అంటే 1,14,486 పెరిగాయి. గత నెల 27వ తేదీ నాటికి ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కరోనా పడకల సంఖ్య 4,497. సరిగ్గా నెలకు వాటి సంఖ్య రెట్టింపు అంటే 9,136 పెరిగాయి. నెల రోజుల్లోనే రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు రెట్టింపయ్యాయి.

ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య మాత్రం తగ్గిందని వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి తాజాగా సమగ్ర నివేదిక సమర్పించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొన్ని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పడకలకు ఇంకా డిమాండ్‌ కొనసాగుతోంది.



గచ్చిబౌలిలో ఉన్న ఒక ప్రముఖ కార్పొరేట్‌ ఆసుపత్రిలో ఉన్న 94 ఆక్సిజన్‌ బెడ్లన్నీ నిండిపోయాయి. సికింద్రాబాద్‌లో ఉన్న మరో ప్రముఖ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ బెడ్లు 71 ఉంటే, 70 నిండిపోయాయి. అందులో 35 ఐసీయూ పడకలుంటే 30 నిండిపోయాయి.

కేసులు పెరుగుతున్నా, పడకలున్నా ఆసుపత్రుల్లో చేరేవారు తక్కువయ్యారు. గత నెల 27వ తేదీ నాటి లెక్క ప్రకారం… మొత్తం ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పడకలు 4,497 ఉంటే, 3,032 పడకలు కరోనా రోగులతో నిండిపోయాయి. ఇంకా 1,465 పడకలు అంటే 32.57 శాతం మాత్రమే ఖాళీగా ఉన్నాయి.



కానీ, ఈ నెల 26వ తేదీ నాటి లెక్క ప్రకారం మొత్తం ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పడకలు 9,136 ఉండగా, 4,246 నిండిపోయాయి. ఇంకా 4,890 ఖాళీగా ఉన్నాయి. 53.52 శాతం ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న పడకల శాతం 20.95 శాతానికి పెరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందేవారి శాతం పెరిగింది.

హైదరాబాద్‌ను మినహాయిస్తే జిల్లాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. నెల క్రితం ప్రభుత్వ ఆసుపత్రుల్లో 73.45 శాతం పడకలు ఖాళీగా ఉండగా, ఇప్పుడు 68 శాతమే ఉన్నాయి.



ఇళ్లలో చికిత్స పొందే బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత నెల 27న యాక్టివ్‌ కేసులు 13,753 ఉండగా, అందులో ఇళ్లలో చికిత్స పొందినవారు 8,479 మంది(61 శాతం) ఉన్నారు. ఈ నెల 26వ తేదీ నాటి లెక్క ప్రకారం 27,600 యాక్టివ్‌ కేసులుంటే, వాటిల్లో 20,866 మంది(75 శాతం) ఇళ్లలో చికిత్స పొందుతున్నారు. నెల రోజుల్లో ఇళ్లలోనే ఉంటూ చికిత్స పొందేవారు 14 శాతం పెరిగారు.

కారణాలివే :
ప్రైవేట్‌ ఆసుపత్రులను జనాలు చీదరంచుకుంటున్నారు.ఠ
అధికంగా ఫీజులు వసూలు చేయడమే కారణం.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరితే అంతగా డబ్బు ఖర్చ ఉండదనే భావన.
బీమా వర్తించదని చెప్పడం… డబ్బులు చెల్లించనిదే శవాలు కూడా అప్పగించకపోవడం



ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యానికి ఖర్చు పెద్దగా ఉండదని, అనవసరంగా ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లొద్దని సర్కారు చేసిన ప్రచారం ఫలించడం
సాధారణ లక్షణాలుంటే.. తెలిసిన డాక్టర్లను టెలి కన్సల్టేషన్‌ లేదా టెలి మెడిసిన్‌తో చికిత్స పొందుతుండటం
సీరియస్‌గా ఉంటే మాత్రమే వెళుతున్నారు. యాంటీ బయోటిక్స్, విటమిన్ మందులు వాడడం.