×
Ad

Telangana Fiber Grid: పండుగ చేసుకునే వార్త.. జస్ట్ రూ.300 కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఓటీటీ.. అబ్బో ఇంకా..

వర్చువల్ డెస్క్‌టాప్ ఫీచర్‌తో, టీవీ కంప్యూటర్ లాగా పనిచేస్తుంది. మొబైల్ సిగ్నల్స్ తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా, ఇంటర్నెట్ ఆధారిత ఫోన్ కాల్స్ చేయవచ్చు.

  • తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ద్వారా డిజిటల్ సేవలు
  • కేవలం రూ.300కే అందుబాటులోకి..
  • రెండేళ్లలో కోటి ఇళ్లకు చేరువ కావాలనే లక్ష్యం 

Telangana Fiber Grid: తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ద్వారా డిజిటల్ సేవలు త్వరలో అత్యంత మారుమూల గ్రామాలకు కూడా చేరనున్నాయి. ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఓటీటీ సేవలు కేవలం రూ.300కే అందుబాటులోకి వస్తాయి.

రెండేళ్లలో కోటి ఇళ్లకు చేరువ కావాలనే లక్ష్యంతో, రాబోయే ఆరు నెలల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌తో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.

తెలంగాణ అంతటా త్వరలో గ్రామాలకు డిజిటల్ కనెక్టివిటీ విస్తరిస్తుందని అధికారులు తెలిపారు. నగరాలకే పరిమితమైన హై-స్పీడ్ ఇంటర్నెట్, త్వరలో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి చేరుకుంటుంది. ప్రజలకు సరసమైన బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును వేగవంతం చేస్తోంది.

రాబోయే 6 నుండి 12 నెలల్లో, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికి హై-స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వం గృహాల కోసం సెట్-టాప్ బాక్స్‌లు ప్రత్యేక డేటా ప్లాన్‌లను కూడా సిద్ధం చేస్తోంది. ఎంపిక చేసిన నాలుగు గ్రామాల్లో ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్ట్ విజయవంతంగా అమలు చేస్తున్నారు. రెండేళ్లలోపు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను విస్తరించడమే లక్ష్యం.

Also Read: పెళ్లి ముహూర్తాలు మళ్లీ షూరు.. ఈ తేదీల్లో మ్యారేజ్‌ చేసుకున్నారంటే..

ప్రాథమిక ప్రణాళిక ప్రకారం, కేబుల్ టీవీ, ఇంటర్నెట్, డజన్ల కొద్దీ ప్రభుత్వ సేవలు ఒకే ప్లాట్‌ఫామ్ కింద కేవలం రూజ300కే అందిస్తారు. అవసరమైతే ప్రతి ఇంటికి 1 జీబీపీఎస్‌ వరకు వేగాన్ని అందించడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ఇంటి ఇంటర్నెట్ లేదా మొబైల్ డేటా వినియోగానికి మాత్రమే పరిమితం కాదు. ప్రభుత్వం అందించే ఒకే సెట్-టాప్ బాక్స్‌తో, టీవీ కంప్యూటర్ లేదా డిజిటల్ సర్వీస్ సెంటర్ లాగా పనిచేస్తుంది. ఓటీటీ ప్లాట్‌ఫాంలతో పాటు 50కు పైగా సేవలు ఇంటి నుండే అందుబాటులో ఉంటాయి.

విద్యార్థులు యూట్యూబ్ తరగతులకు హాజరు కావచ్చు ప్రజలు తమ టీవీ ద్వారా వైద్య సేవలను పొందవచ్చు. వర్చువల్ డెస్క్‌టాప్ ఫీచర్‌తో, టీవీ కంప్యూటర్ లాగా పనిచేస్తుంది. మొబైల్ సిగ్నల్స్ తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా, ఇంటర్నెట్ ఆధారిత ఫోన్ కాల్స్ చేయవచ్చు. విద్యార్థులు, రైతులు, సాధారణ ప్రజలు తమ మొబైల్ ఫోన్‌ల ద్వారా ప్రభుత్వ సేవలను త్వరగా యాక్సెస్ చేయొచ్చు.

ఈ డిజిటల్ గ్రిడ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మారుస్తుందని నిపుణులు విశ్వసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ ఆధారిత ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, యువత తమ స్వస్థలాల నుండి ఐటీ ఉద్యోగాలలో పనిచేయడానికి వీలు కల్పిస్తుంది.