COVID 19 In Telangana : తెలంగాణలో కరోనా కేసులు ఇంకా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 1707 కేసులు నమోదయ్యాయని, 16 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 3 వేల 456గా ఉంది. తాజాగా..2493 మంది కోలుకున్నారు.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5 లక్షల 74 వేల 103గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 22 వేల 759 యాక్టివ్ కేసులుండగా…జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 158 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. గృహ/సంస్థల ఐసోలేషన్ గల వ్యక్తుల సంఖ్య 22 వేల 759 గా ఉంది.
ఏ జిల్లాలో ఎన్ని కేసులు : –
ఆదిలాబాద్ 05. భద్రాద్రి కొత్తగూడెం 95. జీహెచ్ఎంసీ 158. జగిత్యాల 32. జనగామ 16. జయశంకర్ భూపాలపల్లి 44. జోగులాంబ గద్వాల 17. కామారెడ్డి 06. కరీంనగర్ 84. ఖమ్మం 124. కొమరం భీం ఆసిఫాబాద్ 06. మహబూబ్ నగర్ 54.
మహబూబాబాద్ 81. మంచిర్యాల 70. మెదక్ 13. మేడ్చల్ మల్కాజ్ గిరి 79. ములుగు 39. నాగర్ కర్నూలు 30. నల్గొండ 147. నారాయణపేట 12. నిర్మల్ 05. నిజామాబాద్ 13. పెద్దపల్లి 66. రాజన్న సిరిసిల్ల 38. రంగారెడ్డి 96. సంగారెడ్డి 36. సిద్దిపేట 67. సూర్యాపేట 68. వికారాబాద్ 32. వనపర్తి 36. వరంగల్ రూరల్ 31. వరంగల్ అర్బన్ 67. యాదాద్రి భువనగిరి 40. మొత్తం 1707.
Read More : Delhi Covid : 24 గంటల్లో 238 కరోనా కేసులు, 24 మంది మృతి