Site icon 10TV Telugu

Covid-19 : తెలంగాణలో కొత్తగా 345 కోవిడ్ కేసులు నమోదు

COVID 19

COVID 19

Covid-19 :  తెలంగాణలో ఈరోజు  కొత్తగా 345 కోవిడ్ కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. దీంతో ఇంతవరకు రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసులు సంఖ్య 8,32,219కి చేరింది. ఈరోజు 265 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇంతవరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారిసంఖ్య 8,25,356కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 2,752 యాక్టివ్ కేసులు ఉన్నాయని నివేదికలో వెల్లడించారు. రాష్ట్రంలో కోవిడ్ రికవరీ రేటు 99.18శాతంగా ఉంది. హైదరాబాద్ జిల్లాలో ఈ రోజు 146 కోవిడ్ కేసులు , రంగారెడ్డి జిల్లాలో 32, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 17 కేసులు నమోదయ్యాయి.

Also Read : Viral Video : కలెక్టర్ కళ్లద్దాలు ఎత్తుకెళ్లిన కోతి..లంచం తీసుకుని తిరిగి ఇచ్చింది

Exit mobile version