Covid-19 : హైదరాబాద్ లో పెరుగుతున్న కోవిడ్ కేసులు
తెలంగాణలో ఈరోజు కొత్తగా 477 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
- chvmurthy
- Published On : June 27, 2022 / 09:40 PM IST
Ts Covid
Covid-19 : తెలంగాణలో ఈరోజు కొత్తగా 477 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 279 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 7,99,532 మంది కోవిడ్ బారిన పడగా వారిలో 7,91,461 మంది కోలుకున్నారు. కోవిడ్ రికవరీ రేటు రాష్ట్రంలో 98.99 శాతంగా ఉంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 3,960 యాక్టివ్ కేసులు ఉన్నాయని ప్రజారోగ్య శాఖ ఈరోజు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కోంది. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 258 కోవిడ్ కేసులు రంగారెడ్డి జిల్లాలో 107,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 56 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
Also Read : Corona Cases : దేశంలో కొత్తగా 17,336 కరోనా కేసులు, 13 మరణాలు
