హీరో విజయ్ దేవరకొండ పిటిషన్పై తీర్పును వాయిదా వేసిన హైకోర్టు
విజయ్ దేవరకొండ సామాజిక మాధ్యమాల్లో క్షమాపణ కూడా చెప్పాడని హైకోర్టుకు అతడి తరఫు న్యాయవాది తెలిపారు.
- T Venkateshwarlu
- Updated on- July 31, 2025 / 03:37 PM IST
గిరిజనలను కించపరిచేలా, వారి ప్రతిష్ఠ దెబ్బ తీసేలా విజయ్ దేవర కొండ వ్యాఖ్యలు చేశాడని గతంలో రాయదుర్గం పీఎస్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. తనపై నమోదైన కేసు కొట్టేయాలని విజయ్ దేవరకొండ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఆ వ్యాఖ్యలు చేసిన 2 నెలలు తరువాత ఫిర్యాదు చేశారని, ఇందులో దురుద్దేశం ఉందని అన్నారు.
విజయ్ దేవరకొండ సామాజిక మాధ్యమాల్లో క్షమాపణ కూడా చెప్పాడని హైకోర్టుకు అతడి తరఫు న్యాయవాది తెలిపారు. సోషల్ మీడియాలో చెప్పిన క్షమాపణను పరిగణనలోకి తీసుకోకూడదని ప్రతివాదుల తరుఫు న్యాయవాదలు వాదనలు వినిపించారు. వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు వాయిదా వేసింది.
