YS Sharmila : అమర వీరుల త్యాగం .. కల్వకుంట్ల వారి భోగం : సీఎం కేసీఆర్, కేటీఆర్‌లపై షర్మిల ఘాటు విమర్శలు

తెలంగాణ ఉద్యమంలో వీళ్లేనట, కొట్లాడింది, తెలంగాణ తెచ్చింది దొర ఒక్కడేనట..ఉద్యమాల తెలంగాణ చరిత్రను వక్రీకరించడానికి అయ్యా కొడుకులకు సిగ్గుండాలే.దొంగ దీక్షలతోనో, అమెరికాలో ఉన్న నీ బిడ్డలు ఊడిపడితేనో,పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె దొరకలేదని నాటకాలు ఆడితేనో తెలంగాణ రాలేదు..మూడు తరాల నాయకులు ముక్త కంఠంతో ఉద్యమిస్తే వచ్చింది.

ys sharmila

ys sharmila : సీఎం కేసీఅర్ (CM KCR)పై YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల (ys sharmila) మరోసారి సెటైర్లతో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేసిన షర్మిల అమర వీరుల త్యాగం – కల్వకుంట్ల వారి భోగం అంటూ ఘాటు విమర్శలు చేశారు. మీది పార్టీ కాదు..ఒక మిషన్ నిజమే దొర గారు? అంటూ సెటైరిక్ గా ప్రశ్నించారు. బందిపోట్ల రాష్ట్ర సమితికి “దోపిడీ మిషన్ ” “అమరవీరుల త్యాగం – కల్వకుంట్ల వారి భోగం”వీళ్లు పుట్టకపోతే తెలంగాణ లేదట! దీక్ష చేయకుంటే రాష్ట్రమే రాకుండెనట అంటూ విరుచుకుపడ్డారు.

ఉద్యమంలో వీళ్లేనట, కొట్లాడింది, తెలంగాణ తెచ్చింది దొర ఒక్కడేనట..ఉద్యమాల తెలంగాణ చరిత్రను వక్రీకరించడానికి అయ్యా కొడుకులకు సిగ్గుండాలే అంటూ తెలంగాణ యాసలోనే దుయ్యబట్టారు.1200 మంది అమరుల త్యాగాలపై రాజ భోగాలు అనుభవిస్తూ..రాష్ట్ర సంపదను పందికొక్కుల లెక్క దోచుకుతింటూ..ఉద్యమం కోసం పోరాడి అసువులు బాసిన అమరవీరులను, ప్రజలు అవమానించడమే మీ సంస్కారమా? అంటూ తీవ్రంగా ప్రశ్నించారు.

Puvvada Ajay kumar : ఆ రోజు రాజకీయాలనుంచి తప్పుకుంటా : మంత్రి పువ్వాడ

చావు నోట్లో తలకాయ పెట్టి, బయటకు వచ్చింది ఎందరో అయితే..చావును ముద్దాడి రాష్ట్ర సాధనకు ప్రాణాలర్పించింది మరెందరో అని పేర్కొన్నారు. దొంగ దీక్షలతోనో, అమెరికాలో ఉన్న నీ బిడ్డలు ఊడిపడితేనో,పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె దొరకలేదని నాటకాలు ఆడితేనో తెలంగాణ రాలేదు..మూడు తరాల నాయకులు ముక్త కంఠంతో ఉద్యమిస్తే వచ్చింది కానీ మీరు మాత్రం మీ ఘనత వల్లే తెలంగాణ వచ్చిదంటూ గప్పాలు కొట్టుకుంటున్నారు అంటూ విమర్శించారు.

తెలంగాణ ప్రజల ప్రాణాలను,ఆస్తులను త్యాగం చేస్తే తెలంగాణ వచ్చిందన్నారు.ఉద్యమ నినాదంతో సీఎం పీఠం ఎక్కి..అమరవీరుల అడ్రస్సులు,త్యాగధనుల పేర్లు నామరూపాలు లేకుండా చేసి తమతోనే రాష్ట్రం వచ్చిందని..పచ్చి అబద్ధాలు చెప్పుకుంటున్నారు అయ్యా, కొడుకులు అంటూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై మండిపడ్డారు.తెలంగాణ చరిత్రను,త్యాగాలను కనుమరుగు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.స్వరాష్ట్రంలో అమరులకు గుర్తింపు లేదని..వస్తాయనుకున్న ఉద్యోగాలు రాలేదన్నారు. ఉద్యోగులకు జీతాలు లేవు.కార్మికులకు హక్కులు లేవు..ప్రశ్నించే హక్కును రద్దు చేసి కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తూ…”బాంచన్ దొర నీ కాళ్లు మొక్కుత” అంటే కానీ బ్రతకలేని పరిస్థితి తెలంగాణలో ఉందన్నారు.

Revanth Reddy: కాంగ్రెస్‌లో చేరిన మరికొంత మంది బీఆర్ఎస్ నేతలు.. భారీగా చేరికలపై రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?

ఉద్యమ ఆకాంక్షలను పక్కన పెట్టి, తెలంగాణ పదాన్ని పార్టీ నుంచే తుడిచేసి, తెలంగాణ అంటే.. నై తెలంగాణ అని చెప్తున్న పెద్ద తెలంగాణ ద్రోహి కేసీఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. బందిపోట్ల రాష్ట్ర సమితికి “దోపిడీ మిషన్”.రాష్ట్రాన్ని దోచుకో – దాచుకో ఇదే మీ మిషన్ అంటూ ఘాటు వ్యాఖ్యలతో తనదైన శైలిలో షర్మిల మండిపడ్డారు.


 

ట్రెండింగ్ వార్తలు