Noida : బయట తినే, తాగే పదార్ధాల పట్ల ఎంతటి జాగ్రత్తలు వహించాలో తెలియజేస్తోంది ఈ వార్త. వేసవి కాలం వెళ్లిపోతున్నా ఎండ తీవ్రత ఇంకా తగ్గలేదు. బయటకు వెళ్లినవారు దాహం తగ్గడం కోసం కొబ్బరి బొండాలు తాగుతారు. ఓ కొబ్బరి బొండాల వ్యాపారి బొండాలపై మురుగునీరు చల్లుతున్న వీడియో సీసీ కెమెరాలో రికార్డైంది. నోయిడా పోలీసుల వరకు చేరి చివరికి జైలు పాలయ్యాడు.
కొందరు వ్యాపారస్తులు తినే పదార్ధాలను అపరిశుభ్రంగా విక్రయిస్తుంటారు. కస్టమర్ల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తారు. ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఓ కొబ్బరి బొండాల వ్యాపారి రోడ్డు పక్కన పారుతున్న మురుగునీటిని బాటిల్తో తీసుకుని కొబ్బరి బొండాలపై చిలకరిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. శ్రీ రాధా కృష్ణ స్కై గార్డెన్ సొసైటీ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో చూసిన గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు వ్యాపారిని అరెస్టు చేశారు. వ్యాపారి నవీన్ ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాకు చెందినవాడుగా తెలుస్తోంది.
coconut seller : QR కోడ్తో అమ్మకాలు చేస్తున్న కొబ్బరి వ్యాపారి .. అభినందిస్తున్న నెటిజన్లు
ఈ వీడియో చూసిన జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు వ్యాపారుల నిర్లక్ష్యం తమ ప్రాణాల మీదకు తెచ్చేలా ఉందని మండిపడుతున్నారు. నవీన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Shudh Taaza Nariyal Pani 🤲
Refreshing and Hygienic Coconut Water sprinkled with ‘Aab-e-Zim Zim’ and Sold in Shree Radha Krishna Sky Garden Society in Greater Noida. pic.twitter.com/PumE5uMBNE
— Surender Singh Rana (@Surende05060255) June 6, 2023
@noidapolice – कृपया सूचनार्थ एवं आवश्यककार्यवाही हेतु।
— UP POLICE (@Uppolice) June 5, 2023