ఇక్రిశాట్ లో చిరుత : భయాందోళనలో ఉద్యోగులు

  • Published By: veegamteam ,Published On : February 11, 2019 / 02:01 PM IST
ఇక్రిశాట్ లో చిరుత  : భయాందోళనలో ఉద్యోగులు

Updated On : February 11, 2019 / 2:01 PM IST

సంగారెడ్డి : పటాన్ చెరు ఇక్రిశాట్ లో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. గతంలో ఒకసారి చిరుతను గుర్తించిన ఇక్రిశాట్ భద్రతా సిబ్బంది.. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. తాజాగా మరోసారి చిరుత సంచారాన్ని గుర్తించిన ఇక్రిశాట్ అధికారులు అటవీశాఖ అధికారుల దృష్టికి తెచ్చారు. చిరుత సంచారాన్ని పరిశీలించేందుకు అటవీశాఖ అధికారులు ఇక్రిశాట్ కు వచ్చారు. అటవీశాఖ అధికారులు ఇక్రిశాట్ ను క్షుణ్ణంగా పరిశీలించారు.

 

ఫారెస్టు ఆఫీసర్లు చిరుతను బందించలేకపోయారు. చిరుత సంచరిస్తున్నట్లు కూడా ధృవీకరించలేదు. దీంతో ఇక్రిశాట్ ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు.