ఈసీ సంచ‌ల‌నం : ఇంటెలిజెన్స్ ఐజీ, ఇద్ద‌రు ఎస్పీలపై వేటు

సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. ఇంటెలిజెన్స్‌ ఐజీ ఏబీ

  • Published By: veegamteam ,Published On : March 27, 2019 / 01:39 AM IST
ఈసీ సంచ‌ల‌నం : ఇంటెలిజెన్స్ ఐజీ, ఇద్ద‌రు ఎస్పీలపై వేటు

సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. ఇంటెలిజెన్స్‌ ఐజీ ఏబీ

సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో ముగ్గురు ఐపీఎస్ అధికారులకు షాక్ ఇచ్చింది. వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించింది. ఇంటెలిజెన్స్‌ ఐజీ ఏబీ వెంకటేశ్వర రావును ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఆదేశించింది. కడప ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంలను కూడా ఎలక్షన్ డ్యూటీ నుంచి తప్పించి బదిలీ చేసింది. ఈ ముగ్గుర్ని పోలీస్‌ హెడ్‌ క్వార్టర్‌కు అటాచ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీరికి ఎన్నికల పనులను అప్పగించొద్దని ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. వెంకటేశ్వర రావు స్థానంలో సీనియర్ అధికారికి ఆ బాధ్యతలు అప్పగించాలని సూచించింది.

నిఘా వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలపై ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుపై ఈసీ వేటు వేసింది. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో వైఫల్యంతో చెందారనే విమర్శలతో కడప ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మపై చర్యలు తీసుకుంది. టీడీపీ అభ్యర్థికి చెందిన రూ.5 కోట్లు విడిచిపెట్టారనే ఆరోపణలపై శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంపై చర్యలు తీసుకుంది.

ఇంటెలిజెన్స్ ఐజీ వెంకటేశ్వర రావు టీడీపీకి అనుకూలంగా వ్యహరిస్తున్నారని.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత వైఎస్ జగన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. వెంటనే ఆయన్ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని జగన్ డిమాండ్ చేశారు. వివేకా హత్య జరగడానికి కొద్ది రోజుల ముందే కడప ఎస్పీని మార్చారని.. ఉద్దేశపూర్వకంగానే రాహుల్ దేవ్‌ను కడప ఎస్పీగా తీసుకొచ్చారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఐజీ వెంకటేశ్వర రావు, కడప ఎస్పీలను విధుల నుంచి తప్పించాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావును ఎన్నికల విధుల నుంచి తప్పించాలని వైఎస్ జగన్ 10 రోజుల కిందటే గవర్నర్‌ను కోరారు. వీరిద్దరూ టీడీపీకి అనుకూలంగా పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు.