అసలేం జరిగింది : యువజంట సజీవ దహనం

కొత్తగూడెం : ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో త్వరలో పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ యువజంట మంటల్లో సజీవంగా దహనమయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీలో సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరీక్షించి అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
గత కొంతకాలంగా మాచర్ల వినోద్ అనే 25 యువకుడు తేజస్విని అనే 17 ఏళ్ల యువతి ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న పెద్దలు వారి పెళ్లికి అంగీకరించారు. త్వరలోనే పెళ్లి చేస్తామని మాటిచ్చారు. అప్పటి నుంచి వినోద్..తేజస్వి ఒకే ఇంట్లో రామాంజనేయ కాలనీలో కలిసే జీవిస్తున్నారు. ఇటీవలనే తేజస్విని ఇంటర్ పరీక్షలకు కూడా రాసింది. వీరితో పాటు వినోద్ కు వరుసకు బావమరిది అయిన మరో యువకుడు కూడా ఉంటున్నారు.
Read Also : యువతిపై ప్రేమోన్మాది దాడి: ప్రేమించలేదని కోపం
వినోద్కి మద్యం అలవాటు ఉండటమే కాకుండా అతనిపై పోలీసు స్టేషన్లలో కేసులు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి (మార్చి 17)న వినోద్, అతని బావమరిది, మరికొందరు స్నేహితులందరూ కాలనీలోనే మద్యం తాగారు. అర్ధరాత్రి దాటిన తరువాత అతని స్నేహితులు అంతా వెళ్లిపోయారు. తరువాత వినోద్, అతని బావమరిదులు కూడా ఇంటికి వెళ్లారు. కానీ తెల్లారేసరికి వినోద్ ఇంట్లో నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతుండటంతో స్థానికులు భయాందోళనలకు గురై పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అప్పటికే ఇల్లు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఇంట్లో ఎవరూ లేరని భావించిన స్థానికులు అనుమానం వచ్చి కాలిన ఇంటిని పరిశీలించడంతో వినోద్, తేజస్విని మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయి ఉన్నాయి. ఇల్లు, గృహోపకరణాలు కాలి బూడిదయ్యాయి. వారితో ఉన్న వినోద్ బావమరిది మాత్రం కనిపించలేదు.
స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న వినోద్ బావమరిది కోసం గాలిస్తున్నారు. ఎవరైనా కావాలనే నిప్పంటించారా? లేక వారే ఆత్మహత్య చేసుకున్నారా..కనిపించకుండా పోయిన వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా అనే కోణాల్లో కొత్తగూడెం డీఎస్పీ డాక్టర్ ఎస్ఎం.అలీ, చుంచుపల్లి సీఐ కరుణాకర్, ఎస్సై ఎల్.రవీందర్ దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
- Telangana : ‘రేవంత్ రెడ్డి ఓ దుర్మార్గుడు, బ్లాక్ మెయిలర్..నన్నుబెదిరించాడు..అతను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్..’: మంత్రి మల్లారెడ్డి
- Loan App Harassment : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్న లోన్యాప్ ఆగడాలు..బలైపోతున్న ప్రాణాలు
- Telangana : హెల్త్ హబ్ గా వరంగల్..పైసా ఖర్చు లేకుండా అందరికి కార్పొరేట్ వైద్యం : మంత్రి ఎర్రబెల్లి
- తెలుగు రాష్ట్రాలకు భారీగా పెట్టుబడులు
- Haryanvi Singer Killed: హర్యాణా సింగర్ హత్య.. స్నేహితులే హంతకులు
1Pawan Kalyan : కోనసీమ జిల్లా పేరు మార్పుపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
2Mega154: మలేషియా చెక్కేస్తున్న వాల్తేర్ వీరయ్య..?
3NBCC JOBS : ఎన్ బీసీసీలో ఉద్యోగాల భర్తీ
4Instagram Outage : స్తంభించిన ఇన్స్టాగ్రామ్.. యూజర్లకు లాగిన్ సమస్యలు!
5BJP leader Laxman: ప్రధాని ముందు ముఖం చెల్లకనే కేసీఆర్ రాష్ట్రం విడిచిపోతున్నడు
6Ram Pothineni : కోటి తనయుడి కోసం రామ్ పోతినేని.. 11:11 సినిమా సాంగ్ విడుదల..
7Drugs Case : డ్రగ్స్ కేసులో మాజీ ఎంపీ కొడుకు అరెస్ట్
8Redmi Note 11T Pro : రెడ్మి నుంచి కొత్త Note 11T Pro 5G స్మార్ట్ఫోన్లు.. ఫీచర్లు, ధర ఎంతంటే?
9Vijay Devarakonda : అనన్య, ఛార్మి మధ్యలో విజయ్.. ముంబైలో ఎంజాయ్ చేస్తున్న లైగర్ టీం..
10IIT Hyderabad : హైదరాబాద్ ఐఐటీలో మాస్టర్ డిగ్రీ ప్రవేశాలు
-
Karthi Chidambaram : నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్న కార్తీ చిదంబరం
-
America Gun Culture : అమెరికాలో రోజుకు 53 మందిని బలి తీసుకుంటున్న తుపాకి
-
Konaseema : పచ్చగా ఉండే కోనసీమ ఎర్రబడిపోయింది
-
Konaseema : నివురుగప్పిన నిప్పులా కోనసీమ
-
Biden Emotional : అమెరికాలో మారణహోమం.. బైడెన్ భావోద్వేగం..!
-
Cooking Oils : వంటనూనెల ధరలు తగ్గించేందుకు కేంద్రం చర్యలు
-
Bharat Bandh : నేడు భారత్ బంద్..కులాల వారీగా జనగణనకు డిమాండ్
-
Cooking Oils : తగ్గనున్న వంటనూనెల ధరలు