OMG.. పొల్యూషన్ వల్ల రంగుమారుతున్న రోడ్లు!

  • Published By: veegamteam ,Published On : February 11, 2020 / 02:32 AM IST
OMG.. పొల్యూషన్ వల్ల రంగుమారుతున్న రోడ్లు!

మన దేశమంతా గాలి కాలుష్యం, నేల కాలుష్యం, నీటి కాలుష్యం, ధ్వని కాలుష్యాలతో నిండిపోవడం వల్ల ప్రజలు ఎన్నో జబ్బులకు గురౌతున్నారు. అయితే కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యాలు పాడవుతున్నాయని అందరికి తెలిసిన విషయమే కానీ.. మహారాష్ట్రాలోని థానేలో పొల్యూషన్ వల్ల రోడ్లన్నీ పింక్ కలర్ లోకి మారిపోతున్నాయి. ఇక్కడ అగ్రో కెమికల్, పెస్టిసైడ్, ఇతర కెమికల్ ఇండస్ట్రీలు చాలానే ఉన్నాయట. 

ఆ కెమికల్ ఇండస్ట్రీల వల్ల ఎన్నో ఏళ్లుగా విడుదలవుతున్న గ్యాసెస్, పౌడర్లు, కెమికల్స్ ఈ ఏరియా అంతా కంపు కొడుతోందట. గతంలో ఓసారి కెమికల్స్ కలవడం వల్ల వానచినుకులు సైతం గ్రీన్ కలర్ లో పడ్డాయట. తాజాగా ఇండస్ట్రీల నుంచి కెమికల్ పౌడర్ ఇలా రోడ్ల మీద పడుతుండటంతో.. రోడ్లన్నీ గులాబీ రంగులోకి మారాయట.  దీంతో జనాలంతా మహారాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (MPCB)కి కంప్లెయింట్ చేశారట. 

ఈ విషయం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే వరకూ వెళ్లింది. దీంతో ఈ అంశంపై వెంటనే నివేదిక ఇవ్వాలంటూ ఆయన బుధవారం MPCBని ఆదేశించారు. దీంతో వెంటనే అధికారులు వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించి, రోడ్లపై మట్టి శాంపిల్స్ సేకరించారు. అంతేకాదు పరిస్థితులు ప్రమాదకరంగా మారడంతో కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.