చైనాలో టూరిస్టు బస్సులో మంటలు : 26 మంది మృతి
బీజింగ్ : చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. టూరిస్టు బస్సులో మంటలు చెలరేగడంతో 26 మంది మృతి చెందారు. మరో 28 మందికి గాయాలు అయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మధ్య చైనాలోని హ్యూనన్ ప్రావిన్స్ చాంగ్డే పట్టణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 56 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 53 మంది ప్రయాణికులు కాగా ఇద్దరు డ్రైవర్లు, టూరిస్ట్ గైడ్ ఉన్నారు. బస్సులో ఉన్న వస్తువులకు మంటలు అంటుకోవడంతోనే ప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇద్దరు డ్రైవర్లను అధికారులు అదుపులోకి తీసుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారిస్తున్నారు.
Read Also : ఓటుకు నోటు పంచుతామని వచ్చి గొలుసు కొట్టేశారు