PM Modi : మోదీతో అమిత్ షా, నడ్డా భేటీ

కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.

PM Modi : మోదీతో అమిత్ షా, నడ్డా భేటీ

Modi

PM Modi : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు భేటీ అయ్యారు. కేంద్ర కేబినెట్ విస్తరణ జరగబోతున్నట్లు ఊహాగానాలు వస్తున్న క్రమంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి, ఆ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపైనా చర్చించినట్లు తెలుస్తోంది. యూపీలో బీజేపీని పటిష్ఠం చేసే విధంగా కార్యాచరణపై చర్చలు జరిపినట్లు సమాచారం. ఇక, కేంద్ర మంత్రులతోనూ ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో సమావేశమయ్యారు. రెండేళ్లలో చేసిన అభివృద్ధిపై చర్చించారు. ఈ సమావేశం ఐదు గంటలపాటు జరిగింది. ఈ సమావేశ సమయంలో జేపీ నడ్డా కూడా అక్కడ ఉన్నట్లు సమాచారం.

కాగా, గురువారం రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. మోడీ,అమిత్ షాలతో పాటు బీజేపీ అగ్రనేతలని కలిశారు. యూపీలో కేబినెట్ విస్తరణ ఉంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో యోగి ఢిల్లీ పర్యటన ఆశక్తికరంగా మారింది.