Bharat Jodo Yatra: కర్ణాటకలో ఉత్సాహంగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర (ఫొటో గ్యాలరీ)
Bharat Jodo Yatra: కర్ణాటక రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు రాహుల్ వెంట పాదయాత్రలో పాల్గొంటున్నారు. రాహుల్ గాంధీ స్థానికుల సమస్యలు తెలుసుకుంటూ యాత్రలో ముందుకు సాగుతున్నారు. మహిళలు, యువత, చిన్నారులు రాహుల్తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడుతున్నారు. ఆదివారం ఉదయం కర్ణాటక రాష్ట్రం బళ్లారి పరిధిలో యాత్ర కొనసాగింది. ఇదిలాఉంటే యాత్రలో భాగంగా నలుగురు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురయ్యారు. కాంగ్రెస్ జెండా ఉన్న ఇనుప రాడ్ పట్టుకుని యాత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలో విద్యుదాఘాతంతో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరికి అంబులెన్స్లో వైద్యులు చికిత్స అందించారు. తదుపరి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బళ్లారిలోని న్యూ మోకాలోని సివిల్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు.