కావాలనే కరోనా వైరస్ అంటించుకున్న అమెరికా ఖైదీలు..విడుదల కావటానికి ప్లాన్

  • Published By: nagamani ,Published On : May 14, 2020 / 10:00 AM IST
కావాలనే కరోనా వైరస్ అంటించుకున్న అమెరికా ఖైదీలు..విడుదల కావటానికి ప్లాన్

కరోనా వైరస్ భయంతో ప్రపంచ వ్యాప్తంగా కొన్ని జైళ్ల నుంచి కొంతమంది ఖైదీలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జైలులో ఉండే కొంతమంది ఖైదీలు పక్కా ప్లాన్ వేశారు.

కరోనా సోకితే జైలు నుంచి బయట పడవచ్చని ప్లాన్ వేసిన కొందరు ఖైదీలు, కావాలనే కరోనా వైరస్ ను అంటించుకున్న ఘటన అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కౌంటీ జైలులో వెలుగులోకి వచ్చింది. ఈ ఖైదీలు చేసిన పని సీసీ టీవీ పుటేజ్ లో బైటపడింది. 

ఈ వీడియోలో..ఖైదీలు కరోనా నిబంధలను ఏమాత్రం ఖాతరు చేయకుండా..ఇష్టానురీతిగా ప్రవర్తించారు. ఒకరు తాగిన నీరు మరొకరు తాగటం..ఒకరు ముక్కు చీదిన మాస్క్ ను మరొకరు ధరిస్తూ, కావాలనే వైరస్ ను అంటించుకున్నారు. వీరి చేసిన ఘనకార్యానికి ప్రతిఫలం కూడా వెంటనే వచ్చేసింది. అసలే అంటువ్యాధి అయిన కరోనా వైరస్ చక్కగా వ్యాపించిపోయింది. కేవలం రెండు వారాల్లోనే ఆ జైలులో ఉండే 30మందికి ఖైదీలకు కరోనా సోకింది. 

ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా..ఖైదీలకు కరోనా వ్యాపించటం పైగా కేవలం రెండు వారాల్లోనే ఇంతగా ఎలావ్యాపించింది? అనే విషయంపై అధికారులకు అనుమానాలు వచ్చాయి. దీంతో సీసీటీవీ పుటేజ్ లను పరిశీలించటంతో ఇది బైటపడింది. దీనికి సంబంధించిన వీడియోను జైలు అధికారి అలెకస్ విల్లా విడుదల చేశారు.

ఇంత పక్కాగా ప్లాన్ వేసినా ఖైదీల పాచిక పారలేదు. కరోనా వస్తే విడుదల చేస్తారనుకున్న ఖైదీలకు అధికారులు విడుదల చేయలేదు. వారికి ట్రీట్ మెంట్ చేయిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని..వారంతా కావాలనే కరోనా వైరస్ ను వ్యాధిని వ్యాపించేలా చేసినందుకు వారందరిపైనా కేసులు పెట్టామని అలెకస్ విల్లా తెలిపారు. కాగా, అమెరికాలోని జైళ్లలో ఇప్పటివరకూ 25 వేల మందికి పైగా ఖైదీలకు కరోనా సోకగా..వారిలో 350 మందికిపైగా మృతి చెందారు.  

Read Here>> WHOని చైనా బెదిరించింది..CIA రిపోర్ట్ లో సంచలన విషయాలు