13 ఏళ్ల తర్వాత కుటుంబాన్ని కలిపిన TikTok

  • Published By: Subhan ,Published On : May 16, 2020 / 02:56 AM IST
13 ఏళ్ల తర్వాత కుటుంబాన్ని కలిపిన TikTok

Updated On : October 31, 2020 / 2:21 PM IST

మతిస్థిమితం సరిగా లేక ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తి టిక్ టాక్ యాప్ సాయంతో కుటుంబ సభ్యుల చెంతకు చేరారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం గంగారం సమీపంలోని పెద్ద తండాకు చెందిన రాత్లావత్ ఛాత్రు 13ఏళ్ల కిందట మక్తల్ మండలంలోని గుడిగండ్లకు వచ్చారు. మానసిక్ పరస్థితి సరిగా లేకపోవడంతో ఆలయాలు, పాఠవాళ వద్ద ఉండేవారు. 

ధాత్రు స్థితిగతులపై గ్రామానికి చెందిన మ్యాకలి రామంజనేయులు మే14న టిక్ టాక్ లో వీడియో పోస్టు చేశారు. దీన్ని బిజినేపల్లి మండలానికి చెందిన శంకర్ చూసి ఛాత్రు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. శుక్రవారం వారు గుడిగండ్లకు చేరుకోగా.. భార్య, కుమార్తె, తల్లిని చూసి ఛాత్రు భావోద్వేగానికి గురయ్యారు. స్థానికులు, కానిస్టేబుల్ కతలప్ప సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. 

Read Here>> తెలంగాణను వీడని కరోనా : కొత్త కేసులు 40