Guntur Karam : గుంటూరు కారం సినిమానే టార్గెట్ చేస్తున్నారు అందరూ.. ఎందుకో అర్ధం కావడం లేదు.. థమన్!

గుంటూరు కారం పై వస్తున్న న్యూస్ పై థమన్ రియాక్షన్. ఆ సినిమానే కావాలని అందరూ టార్గెట్ చేస్తున్నారు.

Guntur Karam : గుంటూరు కారం సినిమానే టార్గెట్ చేస్తున్నారు అందరూ.. ఎందుకో అర్ధం కావడం లేదు.. థమన్!

Thaman comments on news about Mahesh Babu Guntur Karam

Guntur Karam : మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న సినిమా గుంటూరు కారం. 2021 లో అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ గత ఏడాది బిగినింగ్ లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. కానీ షూటింగ్ విషయంలో మాత్రం ఈ సినిమా నత్త నడక నడుస్తుంది. అనేక కారణాలు వల్ల ఈ మూవీ షూటింగ్ లేటు అవుతూ వస్తుంది. ఈ మధ్యలో టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆడియన్స్ కి సంతోషాన్ని ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విషయంలో జరుగుతున్న మార్పులు చూసి మళ్ళీ ఎక్కడ రిలీజ్ పోస్ట్‌పోన్ అవుతుందని ఆందోళన చెందుతున్నారు.

Mahesh babu : కోట్లిచ్చే బ్రాండ్స్‌కి మాత్రమే కాదు.. సేవ కోసం కూడా బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్..

ఈ క్రమంలోనే పలు వెబ్ సైట్ ఆర్టికల్స్ ఇలా రాసుకొస్తున్నారు.. ఈ సినిమాలో హీరోయిన్ రోల్ నుంచి పూజా హెగ్డే (Pooja Hegde) తప్పుకోవడంతో ఆల్రెడీ ఆమె పై చిత్రీకరించిన సీన్స్ మళ్ళీ రీ షూట్ చేయాల్సి వస్తుందని, ఇప్పటికి ఆ పూజా రోల్ కి మరో హీరోయిన్ ని ఎంపిక చేయకపోవడంతో ఈ మూవీ షూటింగ్ లేటు అయ్యే ఛాన్స్ ఉందంటూ వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమా నుంచి థమన్ కూడా తప్పుకున్నాడు అంటూ కూడా వార్తలు వినిపించాయి. వీటిపై థమన్ (Thaman) సోషల్ మీడియా వేదికగా ఆల్రెడీ రియాక్ట్ అయ్యిన సంగతి తెలిసిందే.

Jawan : షారుఖ్ ఖాన్ ‘జవాన్’ టీజర్ రిలీజ్.. నేను విలన్ అయితే నా ముందు నిలబడే హీరో ఎవడూ లేడు..

తాజాగా మీడియా ప్రతినిధులతో గుంటూరు కారం గురించి థమన్ మాట్లాడాడు. “ఆ సినిమా పైనే అందరూ పడ్డారు. ఎందుకో నాకు అర్ధం కావడం లేదు. రెండేళ్ల పాటు, నాలుగేళ్ళ పాటు షూటింగ్ జరుపుకున్న, జరుపుకుంటున్న సినిమాలు చాలా ఉన్నాయి. కానీ వాటన్నిటిని వదిలేసి కేవలం గుంటూరు కారం సినిమానే టార్గెట్ చేస్తున్నారు” అంటూ చెప్పుకొచ్చాడు. ఆ సినిమా కోసం అందరూ బాగానే కష్టపడుతున్నట్లు, తప్పకుండా ఒక మంచి సినిమానే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామంటూ థమన్ వెల్లడించాడు.