Apple iPhone 15 Launch : ఆపిల్ ఐఫోన్ 15 ఈరోజే లాంచ్.. భారత్లో తయారైన ఈ ఐఫోన్ ధర తక్కువగా ఉంటుందా?
Apple iPhone 15 Launch : ఆపిల్ ఐఫోన్ 15 మరికొన్ని గంటల్లో (సెప్టెంబర్ 12) లాంచ్ అవుతుంది. భారత మార్కెట్లో తయారైన ఈ ఐఫోన్ ధరను తక్కువ ధరకు అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Apple iPhone 15 Launch : 2023 ఏడాదిలో ఆపిల్ (Apple) అతిపెద్ద ఈవెంట్ వండర్లస్ట్ (Wonderlust) కేవలం కొన్ని గంటల్లో లాంచ్ కానుంది. ఆపిల్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న iPhone 15, iPhone 15 Pro, iPhone 15 Pro Max, iPhone 15 Plus ఫోన్లను లాంచ్ చేయనుంది. కొన్ని అద్భుతమైన ఫీచర్లతో పాటు ఐఫోన్ 14పై భారీ అప్గ్రేడ్లను అందించనుంది. ఐఫోన్ 15 లైనప్ పంచ్ ప్యాక్ చేసినట్లు కనిపిస్తోంది. రాబోయే ఐఫోన్ల గురించి అనేక పుకార్లు, ఊహాగానాలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి.
కొన్ని రోజుల క్రితమే, ఐఫోన్ 15 భారత మార్కెట్లో తయారైందని నివేదిక వెల్లడించింది. అయితే, రాబోయే ఈ ఐఫోన్ 15 ధర తగ్గింపుతో రావచ్చునని అంచనా. అయితే వాస్తవానికి, భారత మార్కెట్లో ఐఫోన్ తయారీ ధరపై ప్రభావం చూపుతుందా? లేదా అనేది చూడాలి.
భారత్లో ఐఫోన్ 15 చౌకగా ఉంటుందా? :
ఆపిల్ ఐఫోన్ 15 భారత మార్కెట్లో తయారైన ఫస్ట్ ఐఫోన్ కాదు. ఐఫోన్ గత వెర్షన్ల మాదిరిగా ఐఫోన్ 13, ఐఫోన్ 14 కూడా ‘మేడ్ ఇన్ ఇండియా’తో వచ్చాయి. కానీ, ఐఫోన్ల ధరపై ఎలాంటి ప్రభావం లేదనే చెప్పాలి. ఐఫోన్ 13 మోడల్ 128GB వేరియంట్ భారత మార్కెట్లో రూ.79,900కి అందుబాటులో ఉండగా, అదేవిధంగా, భారత్లో ఐఫోన్ 14 బేస్ వేరియంట్ కూడా రూ. 79,900 ధరతో లాంచ్ అయింది.
లాంచ్ సమయంలో 2 ఐఫోన్ల ధర 799 డాలర్లు.. రెండు మునుపటి ఐఫోన్ల భారత ధర కేవలం 100 డాలర్లతో సమానంగా ఉంటుంది. ఈ ఏడాదిలో కూడా ఆపిల్ అదే పద్ధతిని అనుసరించే అవకాశం ఉంది. ఐఫోన్ 15 ధర అమెరికా ధరతో సమానంగా ఉంటుంది. భారత్లో ఈ ఐఫోన్ తయారీ అనేది ధరపై ఎలాంటి ప్రభావం చూపదని చెప్పవచ్చు.
ఐఫోన్ 15 త్వరగా భారత్కు వస్తుందా? :
భారత్లో తయారైన ఐఫోన్ 15 చౌకగా లభించనప్పటికీ.. ఊహించిన దానికంటే త్వరగా అందుబాటులోకి రావచ్చు. సాధారణంగా, అమెరికా, యూరప్, యూకే, ఇతర మార్కెట్లలోని యూజర్లు ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసిన క్షణంలోనే కొత్త ఐఫోన్లకు యాక్సెస్ పొందవచ్చు.భారతీయ యూజర్లు ఐఫోన్లను పొందేందుకు ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం వేచి ఉండాలి. కానీ ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. టెక్ దిగ్గజం గ్లోబల్ లాంచ్తో ఐఫోన్ల మధ్య అంతరాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆపిల్ ఈ ఏడాది త్వరగా ఐఫోన్ 15 భారత్లో ఆవిష్కరించాలని యోచిస్తోంది.
అదనంగా, తమిళనాడులో ఐఫోన్ 15 ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైందని బ్లూమ్బెర్గ్ నివేదిక పేర్కొంది. శ్రీపెరంబుదూర్లోని ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ ప్లాంట్ కొత్త సిరీస్ ఐఫోన్లను తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. భారత్ నుంచి వచ్చే ఐఫోన్ల వాల్యూమ్ను పెంచడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని నివేదికలు వెల్లడించాయి.