Special trains: శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఊరట.. తిరుమలకు 20 ప్రత్యేక రైళ్లు..

తిరుమల తిరుపతి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవులు కావడంతో పాటు, పదవ తరగతి విద్యార్థుల పరీక్షలు పూర్తికావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో స్వామివారిని దర్శించుకొనేందుకు బారులు తీరుతున్నారు. వేసవి సీజన్ లో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

Special trains: శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఊరట.. తిరుమలకు 20 ప్రత్యేక రైళ్లు..

Trin

Special trains: తిరుమల తిరుపతి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవులు కావడంతో పాటు, పదవ తరగతి విద్యార్థుల పరీక్షలు పూర్తికావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో స్వామివారిని దర్శించుకొనేందుకు బారులు తీరుతున్నారు. వేసవి సీజన్ లో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం వివిధ రూట్లలో తిరుమలకు 20 అదనపు రైళ్ల నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Trines

మంగళవారం నుంచి హైదరాబాద్ – తిరుపతి, తిరుపతి – హైదరాబాద్, తిరుపతి – కాకినాడ టౌన్, కాకినాడ టౌన్ – తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. అయితే తిరుపతి – హైదరాబాద్ మధ్య మొత్తం 10 ప్రత్యేక సర్వీస్సులు నడుస్తాయి. సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చిరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్ లో ఆగనున్నాయి.

Trins

తిరుపతి – కాకినాడ టౌన్ మధ్య 10ప్రత్యేక సర్వీస్సులను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ రైళ్లు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి.

New Project (2)

కాచిగూడ – తిరుపతి మధ్య రెండు వేసవి ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ప్రత్యేక రైలు జూన్1, జూన్ 2న నడిపిస్తున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు ఉందానగర్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట్, రేణిగుంట రైల్వే స్టేషన్ లలో ఆగుతాయి.