Andhra pradesh : విద్యత్ తీగలు తెగిపడి ఆరుగురు మహిళా కూలీలు మృతి

పొలంలో పంట కోయడానికి వెళుతున్న కూలీలపై విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు.మరో ముగ్గురు కూలీలకు తీవ్రంగా గాయాలయ్యాయి.

Andhra pradesh : విద్యత్ తీగలు తెగిపడి ఆరుగురు మహిళా కూలీలు మృతి

six agricultural Woman laborers died

Andhra pradesh : అనంతపురం జిల్లాలో అత్యంత విషాదం నెలకొంది. పొట్టకూటి కోసం కూలిపనికి వెళ్లిన ఆరుగురు కూలీలను విద్యుత్ తీగలు బలిగొన్నాయి. పొలంలో పంట కోయడానికి వెళుతున్న కూలీలపై విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు.మరో ముగ్గురు కూలీలకు తీవ్రంగా గాయాలయ్యాయి. అనంతపురం జిల్లాలోని బొమ్మనహాల్ మండలం దర్గాహొన్నూర్ లో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.

దర్గాహొన్నూర్ లో మొక్కజొన్న పంట కోయడానికి కూలీలు అందరు కలిసి ఓ ట్రాక్టర్ లో వెళుతున్నారు. ఉదయం ఓ పంట కోసి మరోచోట మొక్కజొన్న కండెలు కోడటానికి ట్రాక్టర్ పై వెళుతుండగా హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగ కూలీలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ పై పడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురు కూలీలు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు కూలీలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటనను గమనించిన స్థానికులు బాధితులను సమీప ఆస్పత్రికి తరలించారు.