Tirumala Rathasaptami : తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు

తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహనాలపై మలయప్పస్వామి వివహరించనున్నారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి విహరించారు.

Tirumala Rathasaptami : తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు

Tirumala

Tirumala Rathasaptami : తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహనాలపై మలయప్పస్వామి వివహరించనున్నారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి విహరించారు. ఆ తర్వాత చిన్నశేష వాహనంపై వివహరించారు.

ఉదయం 11 గంటలకు గరుడు వాహనంపై మలయప్పస్వామి విహరిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటలకు వరకు హనుమంత వాహనంపై ఊరేగుతారు. సాయంత్రం 4 గంటల నుంచి కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.

TTD Shocked Devotees : శ్రీవారి భక్తులకు టీటీడీ ఝలక్.. తిరుమలలో వసతి గదుల అద్దె భారీగా పెంపు

సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనంపై, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. రథసప్తమిని పురస్కరించుకుని ఈ రోజు ఏడు వాహనాలపై దర్శనం ఇవ్వనున్నారు. తిరుమాడ వీధుల్లో మలయప్పస్వామి ఊరేగుతున్నారు.