Nara Lokesh: టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. ఏ1గా నారా లోకేష్!
తెలుగుదేశం పార్టీ నేతలపై మంగళగిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.
Nara Lokesh: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడి చేయగా రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది తెలుగుదేశం పార్టీ.
అయితే, ఈ క్రమంలోనే టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు మంగళగిరి పోలీసులు. టీడీపీ కార్యాలయానికి వచ్చిన సీఐ నాయక్పై దాడి చేశారంటూ మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఈ కేసులో ఏ1గా నారా లోకేష్, ఏ2గా అశోక్ బాబు, ఏ3గా ఆలపాటి రాజా, ఏ4గా తెనాలి శ్రవణ్ పేర్లను చేర్చారు పోలీసులు. హత్యాయత్నం సహా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.