బిగ్‌బాస్-4లో సొహైల్‌కు మిగిలిందిదే.. – అసలు సంగతి

బిగ్‌బాస్-4లో సొహైల్‌కు మిగిలిందిదే.. – అసలు సంగతి

అట్టహాసంగా ప్రారంభమై భారీ అంచనాలతో కొనసాగిన బిగ్ బాస్ సీజన్ 4 ఆదివారం పూర్తయిపోయింది. ఇందులో దాదాపు విన్నింగ్ పొజిషన్ చేరుకున్న తర్వాత ముగ్గురు మాత్రమే మిగిలారు. అప్పుడే కింగ్ నాగార్జున ఇచ్చిన ఆఫర్‌ ను ఎంచుకుని బయటికొచ్చేశాడు సొహైల్. కుటుంబ సభ్యులను కూడా అడిగి తీసుకున్న నిర్ణయంతో రూ.25లక్షల సూట్ కేస్‌తో బయటికొచ్చాడు.

ఆ తర్వాత సొహైల్ తన తమ్ముడు అడిగినట్లు రూ.10లక్షలు అనాథాశ్రమానికి ఇస్తా అని చెప్పాడు. బయటికొచ్చిన తర్వాత నాగర్జున ముందు నిల్చొని ఓ ఐదు లక్షలు అనాథాశ్రమానికి మరో ఐదు లక్షలు మెహబూబ్ ఇల్లు కట్టుకోవడానికి ఇస్తా అని చెప్పాడు. మెహబూబ్ పైకి లేచి నేను సంపాదించుకోగలను నా తరపున కూడా అనాథాశ్రమానికి ఇచ్చేయమని చెప్పాడు. ఇదంతా చూస్తున్న నాగర్జున మరో బంపర్ ఆఫర్ ఇచ్చాడు.

సొహైల్ నువ్వు ఇంటికి రూ.25లక్షలు పట్టుకెళ్లాల్సిందే.. మీ ఇద్దరి తరపున నేను అనాథాశ్రమానికి రూ.10లక్షలు ఇస్తా అని చెప్పేశాడు. అంతే సొహైల్, మెహబూల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆనందంలో వచ్చి నాగర్జున కాళ్ల మీద పడిపోయారు. మిమ్మల్ని చూసి నాకు కూడా ఇన్‌స్పిరేషన్ వచ్చిందని చెప్పి నాగర్జున వాళ్లను పైకి లేపి హగ్ చేసుకున్నారు.

మొత్తం రూ.35లక్షలు గెలుచుకున్న సొహైల్ టాప్ 3కాదు టాప్ 2అని చెప్పి పొగిడేశాడు నోయెల్. బయటకు తీసుకొచ్చిన ప్రైజ్ మనీతో అందరినీ కలిసిన సొహైల్.. 105రోజులు తనపై చూపించిన అభిమానానికి ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాడు.

అంతకంటే ముందు బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అరియానా గ్లోరీ ఎలిమినేట్ అయింది. రెండో ఎలిమినేషన్ కోసం బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిన ఐటమ్ భామ లక్ష్మీరాయ్ తన వెంట అరియానాను వెంటబెట్టుకుని వచ్చింది. దాంతో బిగ్ బాస్-4 ఫైనలిస్టుల్లో ఇద్దరు ఎలిమినేట్ కాగా, ముగ్గురు టైటిల్ రేసులో మిగిలారు.