గంజాయికి రూ. 50 ఇవ్వలేదని తల్లిని చంపిన కొడుకు

  • Published By: murthy ,Published On : August 18, 2020 / 12:32 PM IST
గంజాయికి రూ. 50 ఇవ్వలేదని తల్లిని చంపిన కొడుకు

మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన కొడుకు వాటి కోసం డబ్బులు ఇవ్వలేదని తల్లిని కొట్టి, హత్య చేసిన ఉదంతం బీహార్లో జరిగింది. బీహార్ లోని కైమూరు జిల్లా చైనూర్ పోలీస స్టేషన్ పరిధిలోని ఫక్రాబాద్ లో నివసించే నయిూమ్(23) మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. అతను తన భార్య, తమ్ముడు, తల్లితో కలిసి నివాసం ఉంటుండేవాడు.



ఆగస్టు15, శనివారం రాత్రి నయూమ్ గంజాయి కొనుక్కోటానికి తన తల్లి జాఫ్రూన్ బీవీ ని డబ్బులు అడిగాడు. ఇంట్లో తిండి తినటానికే డబ్బులు లేవు, నేను నీకెక్కడినుంచి డబ్బులు తెచ్చి ఇవ్వాలని చెప్పి ఆమె కోపంగా చెప్పింది. దీంతో వారిద్దరి  మధ్య  తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో నయీమ్ అక్కడే ఉన్న ఇనుప రాడ్ తీసుకుని తల్లి పై దాడి చేసి విపరీతంగా కొట్టాడు. ఆమెను కింద పడేసి చేతులపై కొట్టనారంభించాడు.

ఆమె పై  కూర్చుని గొంతులో గుడ్డలు కుక్కి చంప బోయాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన అతని సోదరుడు  ఇది గుడ్డూ గమనించి అన్నను పక్కకు లాగేసి…తల్లిని రక్షించాడు. తల్లిని దారుణంగా కొట్టిన  అన్నపై దాడి చేయటానికి ప్రయత్నించగా నయీమ్ గుడ్డూను నెట్టి పారిపోయాడు. వెనక్కు వచ్చిన గుడ్డూ తల్లిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ఆమె కన్నుమూసింది.



సమాచారం తెలుసుకున్న పోలీసులు  మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించి శవాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడు నయీమ్  ఆవేశ పూరితంగా వ్యవహరించేవాడని పోలీసులు తెలిపారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన నయీమ్ పదిరోజుల క్రితం భార్యను కొట్టాడు. ఆమె అతడిపై పోలీసు స్టేషన్ లో గృహ హింస కింద  ఫిర్యాదు చేసింది.